NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: అమరావతి తొమ్మిది నగరాల్లో రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్‌ఆర్టీసీ దృష్టి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Amaravati: అమరావతి తొమ్మిది నగరాల్లో రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్‌ఆర్టీసీ దృష్టి

    Amaravati: అమరావతి తొమ్మిది నగరాల్లో రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్‌ఆర్టీసీ దృష్టి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 02, 2025
    08:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజధాని అమరావతిలో రాబోయే రోజుల్లో ప్రజల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, అవసరమైన రవాణా సదుపాయాల కల్పనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) దృష్టి సారించింది.

    ఈ నేపథ్యంలో, అమరావతిలో ఓ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రజలు సులభంగా ప్రయాణించగలిగేలా బస్టాండ్లు, డిపోలు, టెర్మినల్స్‌ వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి అనుకూలమైన భూములను కేటాయించేందుకు సంస్థ కసరత్తు మొదలుపెట్టింది.

    ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ఇతర సంస్థలకు సీఆర్‌డీఏ పరిధిలో భూముల కేటాయింపు జరిగిన నేపథ్యంలో,ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనే బస్టాండ్ల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని భావిస్తోంది.

    అందుకే ఇప్పటి నుంచే భూముల కేటాయింపుపై ప్రణాళిక రూపొందించుకొని, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

    వివరాలు 

    తొమ్మిది నగరాల్లో 90 ఎకరాల భూమి అవసరం 

    అమరావతి మహానగర పరిధిలో ప్రభుత్వం పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటక రంగాలకు సంబంధించిన తొమ్మిది నవనగరాలను నిర్మిస్తోంది.

    ఈ నగరాల్లో ఒక్కొక్కటిలో ఒక బస్టాండ్, దానికి అనుబంధంగా ఒక డిపోను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యోచిస్తోంది.

    ప్రతి బస్టాండ్‌కు 5 ఎకరాలు, ప్రతి డిపోకు 5 ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేసింది.

    అంటే మొత్తం తొమ్మిది బస్టాండ్లు,డిపోలు కలిపి 90 ఎకరాల భూమి అవసరమవుతుందని నిర్ధారించారు.

    ఈ డిపోల నుంచి నడిచే బస్సులు సంబంధిత నగరాల మధ్య మాత్రమే కాకుండా, అమరావతికి సమీపంలోని విజయవాడ, గుంటూరులకు ప్రయాణించేవారికి కూడా సేవలందించనున్నాయి.

    వివరాలు 

    మూడు ఇంటర్‌ఛేంజ్‌ టెర్మినల్స్‌ ఏర్పాటు యోచన 

    దూర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మూడు ప్రధాన ప్రదేశాల్లో ఇంటర్‌ఛేంజ్‌ టెర్మినల్స్‌ ఏర్పాటుపై కూడా ఆర్టీసీ ప్రణాళిక రూపొందిస్తోంది.

    వీటిలో ఒకటి ఉత్తరాంధ్ర,విశాఖపట్నం వైపు నుంచి వచ్చే బస్సులకు, రెండోది రాయలసీమ, చెన్నై, బెంగళూరు వైపుల నుంచి వచ్చే బస్సులకు, మూడోది హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చే బస్సులకు అనుకూలంగా ఉంటుంది.

    ఈ టెర్మినల్స్‌ ద్వారా బయట ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నేరుగా రాజధాని అంతర్భాగంలోకి ప్రవేశించకుండా, అక్కడే ఆగిపోతాయి. అక్కడినుంచి నగరానికి చెందిన సిటీ బస్సుల ద్వారా ప్రయాణికులను అంతర్భాగాలకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు.

    ప్రతి టెర్మినల్‌కు 25 ఎకరాల చొప్పున, మూడు టెర్మినల్స్‌కు కలిపి 75 ఎకరాల భూమి అవసరం ఉంటుంది.

    వివరాలు 

    మొత్తం 165 ఎకరాల అవసరం - సీఆర్‌డీఏకు లేఖ 

    ఇలా నవనగరాల్లోని బస్టాండ్లు, డిపోలు,మూడు ఇంటర్‌ఛేంజ్‌ టెర్మినల్స్‌ కలిపి మొత్తం 165 ఎకరాల భూమి అవసరమవుతుందని ఆర్టీసీ అంచనా వేసింది.

    ఈ అవసరాన్ని గుర్తించి, అవసరమైన భూముల కేటాయింపునకు సంబంధించి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)కు అధికారికంగా లేఖ రాసింది. దీనితో పాటు, ఈ విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా ఆర్టీసీ యాజమాన్యం చేపట్టింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏపీఎస్ఆర్టీసీ

    తాజా

    Amaravati: అమరావతి తొమ్మిది నగరాల్లో రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్‌ఆర్టీసీ దృష్టి ఏపీఎస్ఆర్టీసీ
    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా

    ఏపీఎస్ఆర్టీసీ

    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  తాజా వార్తలు
    ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణం ధర
    Electric Buses: విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్! విశాఖపట్టణం
    APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025