NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం 
    తదుపరి వార్తా కథనం
    మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం 
    మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం

    మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం 

    వ్రాసిన వారు Stalin
    May 04, 2023
    12:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు బుధవారం అర్థరాత్రి కొందరు పోలీసులు మద్యం మత్తులో తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.

    వర్షానికి తమ పరుపులు తడిచాయని, ఈ క్రమంలో నిరసన స్థలానికి మడత మంచాలు తీసుకొస్తున్న సమయంలో తమపై పోలీసులు దాడి చేశారని రెజ్లర్లు పేర్కొన్నారు.

    ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇద్దరు రెజ్లర్ల తలకు గాయాలయ్యాయి. ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

    వర్షాలకు రెజ్లర్ల పరుపులు తడిచిపోవడంతో ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి మడత మంచాలను నిరసన స్థలానికి తీసుకొచ్చారు.

    పోలీసులు వాటికి అనుమిత లేదని చెప్పడంతో చిన్న వాగ్వాదం చెలరేగింది. అనంతరం సోమనాథ్ భారతిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

    దిల్లీ

    మా పథకాలను వెనక్కి తీసుకోండి: ఫోగాట్, పునియా 

    అర్థరాత్రి పోలీసుల తీరుపై ఆసియా, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత వినేష్ ఫోగట్ మండిపడ్డారు. పోలీసులు కఠినంగా ప్రవర్తించేందుకు తాము నేరస్థులమా? అని ప్రశ్నించారు.

    పోలీసుల దగ్గర తుపాకులు ఉన్నాయని, తమను చంపాలనుకుంటే, వెంటనే చంపాలని కన్నీటి పర్యంతం అయ్యారు.

    దీనికోసమే తాము దేశానికి పతకాలు తెచ్చామా అని వాపోయారు. ప్రభుత్వం తమ పథకాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

    మహిళను దుర్భాషలాడే హక్కు ప్రతి ప్రతి పురుషుడికి ఉంటుందా? అని ప్రశ్నించారు.

    ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా మాట్లాడుతూ, తాను సాధించిన అన్ని పతకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

    దిల్లీ

    ధర్మేంద్ర అనే పోలీసు మద్యం సేవించి వినేష్ ఫోగట్‌ను దుర్భాషలాడారు: మాజీ రెజ్లర్ రాజ్‌వీర్ 

    అర్థరాత్రి ఉద్రిక్తతలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది పోలీసులు మద్యం మత్తులో తమపై దాడి చేశారని రెజ్లర్లు ఆరోపించడం అందులో వినవచ్చు.

    ధర్మేంద్ర అనే పోలీసు మద్యం సేవించి వినేష్ ఫోగట్‌ను దుర్భాషలాడినట్లు, తమ గొడవకు దిగినట్లు మాజీ రెజ్లర్ రాజ్‌వీర్ చెప్పారు. పోలీసుల దాడిలో కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ గీతా ఫోగట్ తమ్ముడు దుష్యంత్ ఫోగట్ తలపగిలినట్లు రాజ్‌వీర్ పేర్కొన్నారు.

    ఘర్షణ తర్వాత నిరసన స్థలంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. నిరసన చేస్తున్న మల్లయోధుల వద్దకు మీడియాను అనుమతించకుండా మొత్తం బ్యారికేడ్ చేశారు.

    డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    రెజ్లింగ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    దిల్లీ

    దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు ఆంధ్రప్రదేశ్
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన కోర్టు మనీష్ సిసోడియా
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్

    రెజ్లింగ్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం  సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు  దిల్లీ
    కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం  కర్ణాటక
    విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు సుప్రీంకోర్టు
    తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఐఎండీ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా?  ఉత్తర్‌ప్రదేశ్
    దేశంలో 60వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    ఇన్ఫోసిస్ షేర్లు 12శాతం ఎందుకు పడిపోయినట్లు?  స్టాక్ మార్కెట్
    Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025