NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం 
    మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం 
    భారతదేశం

    మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 04, 2023 | 12:17 pm 0 నిమి చదవండి
    మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం 
    మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం

    దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు బుధవారం అర్థరాత్రి కొందరు పోలీసులు మద్యం మత్తులో తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. వర్షానికి తమ పరుపులు తడిచాయని, ఈ క్రమంలో నిరసన స్థలానికి మడత మంచాలు తీసుకొస్తున్న సమయంలో తమపై పోలీసులు దాడి చేశారని రెజ్లర్లు పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇద్దరు రెజ్లర్ల తలకు గాయాలయ్యాయి. ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వర్షాలకు రెజ్లర్ల పరుపులు తడిచిపోవడంతో ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి మడత మంచాలను నిరసన స్థలానికి తీసుకొచ్చారు. పోలీసులు వాటికి అనుమిత లేదని చెప్పడంతో చిన్న వాగ్వాదం చెలరేగింది. అనంతరం సోమనాథ్ భారతిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

    మా పథకాలను వెనక్కి తీసుకోండి: ఫోగాట్, పునియా 

    అర్థరాత్రి పోలీసుల తీరుపై ఆసియా, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత వినేష్ ఫోగట్ మండిపడ్డారు. పోలీసులు కఠినంగా ప్రవర్తించేందుకు తాము నేరస్థులమా? అని ప్రశ్నించారు. పోలీసుల దగ్గర తుపాకులు ఉన్నాయని, తమను చంపాలనుకుంటే, వెంటనే చంపాలని కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికోసమే తాము దేశానికి పతకాలు తెచ్చామా అని వాపోయారు. ప్రభుత్వం తమ పథకాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. మహిళను దుర్భాషలాడే హక్కు ప్రతి ప్రతి పురుషుడికి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా మాట్లాడుతూ, తాను సాధించిన అన్ని పతకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

    ధర్మేంద్ర అనే పోలీసు మద్యం సేవించి వినేష్ ఫోగట్‌ను దుర్భాషలాడారు: మాజీ రెజ్లర్ రాజ్‌వీర్ 

    అర్థరాత్రి ఉద్రిక్తతలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది పోలీసులు మద్యం మత్తులో తమపై దాడి చేశారని రెజ్లర్లు ఆరోపించడం అందులో వినవచ్చు. ధర్మేంద్ర అనే పోలీసు మద్యం సేవించి వినేష్ ఫోగట్‌ను దుర్భాషలాడినట్లు, తమ గొడవకు దిగినట్లు మాజీ రెజ్లర్ రాజ్‌వీర్ చెప్పారు. పోలీసుల దాడిలో కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ గీతా ఫోగట్ తమ్ముడు దుష్యంత్ ఫోగట్ తలపగిలినట్లు రాజ్‌వీర్ పేర్కొన్నారు. ఘర్షణ తర్వాత నిరసన స్థలంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. నిరసన చేస్తున్న మల్లయోధుల వద్దకు మీడియాను అనుమతించకుండా మొత్తం బ్యారికేడ్ చేశారు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    రెజ్లింగ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దిల్లీ

    దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    దిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు ఐఎండీ
    తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య తాజా వార్తలు

    రెజ్లింగ్

    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    రెజ్లర్ల పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ  ప్రపంచం
    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం  సుప్రీంకోర్టు
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం తెలంగాణ
    జమ్ముకశ్మీర్‌‌లో మరో ఎన్‌కౌంటర్‌- ఇద్దరు ఉగ్రవాదులు హతం  జమ్ముకశ్మీర్
    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను  తుపాను
    దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ ప్రారంభం; దీని విశేషాలు ఇవిగో హైదరాబాద్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు  పెన్షన్
    ఉత్తర్‌ప్రదేశ్: వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి  ఉత్తర్‌ప్రదేశ్
    విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు సుప్రీంకోర్టు
    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక జి.కిషన్ రెడ్డి
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023