NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AAP-Congress: కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెప్పేసిన కేజ్రీవాల్
    తదుపరి వార్తా కథనం
    AAP-Congress: కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెప్పేసిన కేజ్రీవాల్
    AAP-Congress: కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెప్పేసిన కేజ్రీవాల్

    AAP-Congress: కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెప్పేసిన కేజ్రీవాల్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 11, 2024
    11:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే ఏడాది ప్రారంభంలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో,ఇండియా కూటమి పార్టీలు అయిన ఆప్‌, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరి దశకు చేరుకున్నాయి.

    అవి కలిసి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ అంశంపై స్పందిస్తూ, "దిల్లీ ఎన్నికల్లో ఆప్‌ స్వతహాగా పోటీ చేస్తూ ముందుకువెళ్లనుంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవటం అసాధ్యం" అని ఎక్స్ వేదికగా ప్రకటించారు.

    అటు,ఆప్-కాంగ్రెస్ మధ్య పొత్తు గురించి వస్తున్న వార్తలలో,కాంగ్రెస్‌కు 15 స్థానాలు కేటాయించేలా చర్చలు జరుగుతున్నాయని, ఇంకా 1-2 స్థానాలు ఇండియా కూటమి ఇతర పార్టీలకు కేటాయించేందుకు అవగాహన ఉందని సమాచారం వస్తోంది.

    వివరాలు 

     ఎన్నికలపై ఫోకస్ 

    అయితే, ఈ ప్రకటనపై కేజ్రీవాల్ అంగీకరించకుండా, వాటిని ఖండించారు.

    ఇదిలా ఉంటే, ఆప్ ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తన అభ్యర్థుల జాబితాను రెండు విడతల్లో విడుదల చేసింది, మొత్తం 31 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

    ఇదే సమయంలో, ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన తరువాత, ఆయన ఇటీవల ప్రకటించారు.

    ప్రజలు తనకు విశ్వసనీయత సర్టిఫికెట్ ఇచ్చేవరకు సీఎం పదవిలో ఉండబోనని కొన్ని నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.

    ప్రస్తుతం, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, రానున్న ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ సందర్భంగా, ఆప్‌ నేత ఆతిశీ దిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

    వివరాలు 

    రూ. కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి నివాసానికి మార్పులు 

    ఇక, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 'సీఎం బంగ్లా' వివాదం రాజుకోవడమేకాక, ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది.

    తనను తాను సామాన్యుడిగా చెప్పుకునే కేజ్రీవాల్ అధికారంలో ఉన్నప్పుడు రూ. కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి నివాసానికి (Delhi CM Bungalow)మార్పులు చేసారని, ప్రజాధనం దుర్వినియోగం చేశారని భాజపా ఆరోపిస్తోంది.

    దీనిపై ఆప్‌ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ, " విద్య, ఆరోగ్య సంస్కరణల విషయాల్లో ప్రజలు అడుగుతున్నప్పుడు, వారు మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతున్నారని" ఆగ్రహం వ్యక్తం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టు నుంచి కేజ్రీవాల్‌కు లభించని ఉపశమనం.. బెయిల్‌పై స్టే  భారతదేశం
    Arvind Kejriwal: చిక్కుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి..విచారణకు ముందే కేజ్రీవాల్‌ అరెస్టు? భారతదేశం
    Arvind Kejriwal: సీబీఐ అరెస్ట్ తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న అరవింద్ కేజ్రీవాల్ భారతదేశం
    Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ 3 రోజుల కస్టడీ   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025