NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TS Assembly: రెవిన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది: శ్వేతపత్రాన్ని విడుదల చేసిన భట్టి 
    తదుపరి వార్తా కథనం
    TS Assembly: రెవిన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది: శ్వేతపత్రాన్ని విడుదల చేసిన భట్టి 
    శ్వేతపత్రాన్ని విడుదల చేసిన భట్టి

    TS Assembly: రెవిన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది: శ్వేతపత్రాన్ని విడుదల చేసిన భట్టి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 20, 2023
    01:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు.

    శ్వేతపత్రం ప్రకారం, రాష్ట్ర మొత్తం అప్పు 2014-15లో రూ.72,658 కోట్ల నుంచి రూ.6.71 కోట్లకు (6,71,757) పెరిగింది.

    రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో ఈరోజు చర్చ ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శ్వేత పత్రాన్ని విడుదల చేసి ప్రసంగించారు.

    చర్చకు ముందు సభలో 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు.

    Details

    ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తాం: భట్టి 

    ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..తెలంగాణ సాధించింది ప్రజలంతా అభివృద్ధి చెందడానికన్నారు. కానీ,బిఆర్ఎస్ ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించుకోకుండా రోజూవారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి సృష్టించిందన్నారు.

    ఇలాంటి పరిస్థితి రావడాన్ని నేను దురదృష్టంగా భావిస్తునన్న ఆయన దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలన్నారు.

    ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు అన్నారు.

    విద్య,ఆరోగ్యం వంటి కీలక రంగాలపై తెలంగాణ రాష్ట్రం తగినంత నిధులు వెచ్చించలేకపోయిందని, ఇక్కడ బడ్జెట్‌లో మొత్తం వ్యయం నిష్పత్తిలో దేశంలోనే అత్యల్పంగా ఉందన్నారు.

    పై వాస్తవాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే,2014లో రెవెన్యూ మిగులు రాష్ట్రంగా,దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భట్టి విక్రమార్క మల్లు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    భట్టి విక్రమార్క మల్లు

    నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం  ఖమ్మం
    తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నెలకోల్పుతాం: భట్టి విక్రమార్క కాంగ్రెస్
    Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌  మల్లికార్జున ఖర్గే
    #TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025