NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం 
    జ్ఞాన్వాపి మసీదు: భారీ భద్రత నడుమ జ్ఞాన్వాపి మసీదులో సర్వే ప్రారంభం

    Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం 

    వ్రాసిన వారు Stalin
    Jul 24, 2023
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు(Gyanvapi mosque) సముదాయంలో సోమవారం ఉదయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం సర్వేను ప్రారంభించింది.

    వారణాసి జిల్లా కోర్టు జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    ఇదే సమయంలో వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    సుప్రీంకోర్టులో విచరణ జరగక ముందే మసీదులో సర్వే నిర్వహిస్తున్నట్లు మసీదు నిర్వహణ కమిటీ చెబుతోంది.

    జ్ఞానవాపి మసీదు ముందుగా ఉన్న హిందూ దేవాలయంపై నిర్మించబడిందా? లేదా? అని నిర్ధారించడానికి వాస్తవాలు తెలియాలంటే శాస్త్రీయ పరిశోధన అవసరమని వారణాసి జిల్లా కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు పురావస్త అధికారులు సర్వే చేపడుతున్నారు.

    యూపీ

    40మంది సభ్యుల సమక్షంలో సర్వే

    ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం ఆదివారం నాడే సర్వేకు కావాల్సిన అన్ని పరికరాలతో వారణాసికి చేరుకుంది.

    యూపీ పోలీసుల భారీ భద్రత నడుమ సర్వేను నిర్వహిస్తున్నారు. మొత్తం 40మంది సభ్యుల సమక్షంలో ఈ శాస్త్రీయ సర్వేను చేపడుతున్నారు.

    అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ కమిటీ ఈ సర్వేలో పాల్గొనడం లేదు.

    తాము సర్వేను బహిష్కరించినట్లు కమిటీ సంయుక్త కార్యదర్శి ఎస్ఎం యాసిన్ పేర్కొన్నారు.

    గతేడాది మే 16న కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్‌వాపి మసీదులో కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహించగా హిందువులకు సంబంధించి 'శివలింగం', ముస్లీంలకు సంబంధించి 'ఫౌంటెన్' నిర్మాణాలను గుర్తించారు. ఈ క్రమంలో శాస్త్రీయ ఆధారాల కోసం ఇప్పుడు ఈ సర్వే చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    జ్ఞానవాపి మసీదు
    తాజా వార్తలు

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఉత్తర్‌ప్రదేశ్

    మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా?  తాజా వార్తలు
    Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు  హత్య
    భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు తాజా వార్తలు
    గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ  సుప్రీంకోర్టు

    జ్ఞానవాపి మసీదు

    జ్ఞానవాపి మసీదులో కీలక పరిణామం.. శాస్త్రీయ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్ భారతదేశం

    తాజా వార్తలు

    IPO: ఐపీఓ లిస్టింగ్‌లో భారత్ టాప్; ఈ ఏడాది 80లాంచ్‌లతో అదరగొట్టిన బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ  స్టాక్ మార్కెట్
    Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే! ఫ్రాన్స్
    Rajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు  రాజస్థాన్
    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025