NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అసెంబ్లీ ఎన్నికలు: 'రాహుల్ జీ.. కర్ణాటక సమస్యలపై గొంతు విప్పాలి'; కాంగ్రెస్ శ్రేణుల వేడుకోలు
    తదుపరి వార్తా కథనం
    అసెంబ్లీ ఎన్నికలు: 'రాహుల్ జీ.. కర్ణాటక సమస్యలపై గొంతు విప్పాలి'; కాంగ్రెస్ శ్రేణుల వేడుకోలు
    అసెంబ్లీ ఎన్నికలు: 'రాహుల్ జీ.. కర్ణాటక సమస్యలపై గొంతు విప్పాలి'; కాంగ్రెస్ శ్రేణుల వేడుకోలు

    అసెంబ్లీ ఎన్నికలు: 'రాహుల్ జీ.. కర్ణాటక సమస్యలపై గొంతు విప్పాలి'; కాంగ్రెస్ శ్రేణుల వేడుకోలు

    వ్రాసిన వారు Stalin
    Apr 06, 2023
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నెల రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఆశపడుతుంది.

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 10వ తేదీన ఎన్నికల ప్రచారం కోసం రావడం ఆసక్తికరంగా మారింది. ఆయన కర్ణాటకకు వస్తే ఏం మాట్లాడుతారనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

    రాహుల్ ఇటీవల ఎక్కడ మాట్లాడినా, ట్వీట్ చేసినా అదానీ విషయం తప్పా వేరేది మాట్లాడటం లేదు.

    అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అదానీ అంశం అంత ప్రభావం చూపకపోవచ్చని స్థానిక కాంగ్రెస్ నాయుకలు చెబుతున్నారు. ఒకటి, రెండు సార్లు అయితే ఓకే కానీ, ప్రతి చోట అదానీ అంశం వర్కవుట్ కాకపోవచ్చని అంటున్నారు.

    కాంగ్రెస్

    జాతీయ స్థాయి సమస్యలను లేవనెత్తితే మోదీ వర్సెస్ రాహుల్‌గా మారే అవకాశం

    2019లో కర్ణాటకలో చేసిన వ్యాఖ్యల వల్లే రాహుల్‌ గాంధీకు సూరత్ కోర్టు జైలు శిక్ష విధించింది. పర్యావసానంగా రాహుల్ లోక్‌సభకు అనర్హుడయ్యారు. ఈ కోణంలో కూడా రాహుల్ మాటలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    రాహుల్ అదానీ అంశం కాకుండా రాష్ట్రంలోని సమస్యలపై గళం విప్పాలని కర్ణాటక నాయకులు కోరుతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిపై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అంటున్నారు.

    కర్ణాటకలో జాతీయ స్థాయి సమస్యలను లేవనెత్తితే అది మోదీ వర్సెస్ రాహుల్‌గా మారే అవకాశం ఉందని, తద్వార బీజేపీకే అనుకూలంగా మారుతుందని మరికొందరు కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

    అందుకే కర్ణాటక ప్రచారంలో బొమ్మై ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై రాహుల్ గొంతు విప్పాలని స్థానిక నాయకత్వం కోరుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    రాహుల్ గాంధీ
    కాంగ్రెస్

    తాజా

    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్
    Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్

    కర్ణాటక

    భద్రతలో వైఫల్యం: ప్రధాని మోదీపైకి దూసుకొచ్చిన యువకుడు ప్రధాన మంత్రి
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు
    డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10లక్షల జరిమానా విమానం
    Budget 2023: కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు, బడ్టెట్‌లో భారీగా కేటాయింపులు అసెంబ్లీ ఎన్నికలు

    అసెంబ్లీ ఎన్నికలు

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది? తెలంగాణ
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం త్రిపుర

    రాహుల్ గాంధీ

    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ జమ్ముకశ్మీర్
    నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం జమ్ముకశ్మీర్
    'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్ నరేంద్ర మోదీ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ అదానీ గ్రూప్

    కాంగ్రెస్

    మేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని నాగాలాండ్
    కాంగ్రెస్ ప్లీనరీ: సీడబ్ల్యూసీకి ఎన్నికలు వద్దంటూ తీర్మానం; ఖర్గేకు బాధ్యత అప్పగింత ఛత్తీస్‌గఢ్
    కాంగ్రెస్ ప్లీనరీలో రోశయ్య, జైపాల్‌రెడ్డికి సంతాపం; రెండో‌రోజు సెషన్‌కు సోనియా, రాహుల్ హాజరు ఛత్తీస్‌గఢ్
    Congress Plenary: పొలిటికల్ రిటైర్మెంట్‌పై సోనియా కీలక ప్రకటన; బీజేపీ పాలనపై ఫైర్ ఛత్తీస్‌గఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025