NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ys Vijaamma: వైఎస్సార్ పేర్లపై ఆస్తులు రాశారు.. ఆస్తుల వివాదంలో విజయమ్మ స్పష్టత
    తదుపరి వార్తా కథనం
    Ys Vijaamma: వైఎస్సార్ పేర్లపై ఆస్తులు రాశారు.. ఆస్తుల వివాదంలో విజయమ్మ స్పష్టత
    వైఎస్సార్ పేర్లపై ఆస్తులు రాశారు.. ఆస్తుల వివాదంలో విజయమ్మ స్పష్టత

    Ys Vijaamma: వైఎస్సార్ పేర్లపై ఆస్తులు రాశారు.. ఆస్తుల వివాదంలో విజయమ్మ స్పష్టత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 30, 2024
    10:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్సార్ ఉన్నప్పుడు ఆస్తులు పంచారని ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు.

    విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా ఉన్నందున, ఆయనకు అన్ని విషయాలు తెలుసునని చెప్పారు.

    వైవీ సుబ్బారెడ్డి తమ కుటుంబ సభ్యుడిగా ఆస్తుల అగ్రిమెంట్‌పై సాక్షి సంతకం చేశారని ఆమె గుర్తు చేశారు.

    అయినప్పటికీ మీడియాతో అవాస్తవాలను మాట్లాడడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు.

    వైఎస్ఆర్ ఉన్నప్పుడు కొన్ని ఆస్తులు జగన్, వైఎస్ షర్మిల పేర్ల మీద రాశారని, ఇది ఆస్తుల పంపిణీ కాదని తెలిపారు.

    Details

    నలుగురు బిడ్డలకు సమానంగా ఆస్తులు

    మంగళవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో విజయమ్మ పలు కీలక అంశాలను వెల్లడించారు.

    తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమే అని, ఆస్తులు కూడా ఇద్దరికీ సమానంగా పంచాల్సిందేని స్పష్టం చేశారు.

    వైఎస్ఆర్ తన ఆస్తులను నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా పంచాలని చెప్పారన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

    2009 నుంచి 2019 వరకు ఇద్దరు కలసి ఉన్నారని, డివిడెండ్ రూపంలో జగన్ తన వాటా తీసుకుని, రూ.200 కోట్లు షర్మిలకు ఇచ్చారని పేర్కొన్నారు. అగ్రిమెంట్ ప్రకారం, జగన్‌కు 60 శాతం, షర్మిలకు 40 శాతం ఉందన్నారు.

    Details

    షర్మిలకు అన్యాయం జరిగింది

    2019లో సీఎం అయిన రెండు నెలలకు, జగన్ అటాచ్‌మెంట్‌ ఉన్న ఆస్తులను విడదీయాలని ప్రపోజల్ ఇచ్చారని, అటాచ్‌మెంట్‌లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, ఎలహంక ప్రాపర్టీ 100 శాతం షర్మిలకు ఇవ్వాలనే నిర్ణయించుకున్నారని చెప్పారు.

    అయితే ఈ ఆస్తులు ఇవ్వకుండానే షర్మిలకు అన్యాయం జరిగిందన్నారు.

    షర్మిలకు చేరాల్సిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ ఇల్లు వంటి ఆస్తులను కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉందని విజయమ్మ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ షర్మిల
    విజయసాయిరెడ్డి

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    వైఎస్ షర్మిల

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల హైదరాబాద్
    కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ కాంగ్రెస్
    సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ వై.ఎస్.జగన్

    విజయసాయిరెడ్డి

    సీఎం జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Purendeswari: విజయసాయి రెడ్డి భూ దోపిడీకి పాల్పడుతున్నారు.. బెయిల్ రద్దు చేయండి: సీజేఐకి పురందేశ్వరి లేఖ దగ్గుబాటి పురందేశ్వరి
    శత్రువులకు కూడా పురందేశ్వరి లాంటి కూతురు పుట్టకూడదు : విజయసాయిరెడ్డి బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025