NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు
    తదుపరి వార్తా కథనం
    Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు
    అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు

    Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 22, 2024
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలో మృతుల చెందిన కుటుంబాలకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.

    అందులో ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కోటి రూపాయల పరిహారాన్ని అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ప్రకటించారు.

    అదే విధంగా ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారాన్ని అందించనున్నట్లు మోదీ ప్రకటించారు.

    ఇక గాయపడిన వారికి రూ.50వేలు పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

    Details

    ఇవాళ విశాఖకు సీఎం చంద్రబాబు నాయుడు

    అచ్యుతాపురం సెజ్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.

    ఇక గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ఇవాళ సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖకు వస్తున్నారు.

    ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 41 మందిని పరామర్శించి, వారికి పరిహారం అందించనున్నారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో 12 మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోంది.

    Details

    మృతులు వీరే

    అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయ్యింది. శిథిలాల కింద చిక్కుకున్న 33 మందిని జెయింట్ ఫైరింజిన్ తో బయటికి తీశారు.

    ప్రమాద ఘటనపై రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది

    మృతుల వివరాలు

    1)నీలాపు రామిరెడ్డి

    2. ప్రశాంత్ హంస

    3. నారాయణరావు

    4. గణేష్ కుమార్

    5. హారిక

    6. రాజశేఖర్

    7. సతీష్

    8. నాగబాబు

    9. నాగేశ్వర రామచంద్ర రావు

    10. సన్యాసినాయుడు

    11. చిన్నారావు

    12. పార్థసారథి

    మోహన్ దుర్గాప్రసాద్

    14. ఆనందరావు

    15. సురేంద్ర

    16. వెంకట సాయి

    17. చిరంజీవి

    18. గుర్తు తెలియని వ్యక్తి

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అనకాపల్లి
    చంద్రబాబు నాయుడు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    అనకాపల్లి

    Dadi Veerabhadra Rao: వైసీపీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు  ఆంధ్రప్రదేశ్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu: ఈ నెల 14న టిడిపి రెండో జాబితా: చంద్రబాబు భారతదేశం
    TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    AP Skill development case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు  స్కిల్ డెవలప్ మెంట్ కేసు
    TDP: విరాళాల వెబ్ సైట్ ప్రారంభించిన టిడిపి.. మొదటి విరాళం ఎంతో తెలుసా?  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025