NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Atishi: శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది: అతిషి మార్లెనా
    తదుపరి వార్తా కథనం
    Atishi: శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది: అతిషి మార్లెనా

    Atishi: శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది: అతిషి మార్లెనా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 20, 2024
    04:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వెలుపల జరిగిన పేలుడు కలకలం సృష్టిస్తోంది.

    ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి అతిషి మార్లెనా, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

    శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నా, వారు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.

    వివరాలు 

    దిల్లీ ముంబయిలా మారిపోతుంది: అతిషి

    "ఈ పేలుడు ఘటనతో రాజధాని నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని తెలుస్తోంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అయితే, బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దిల్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనులకు అంతరాయం కలిగించడానికి మాత్రమే తాము సమయాన్ని వినియోగిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల దిల్లీ ముంబయిలా మారిపోతుంది. ప్రస్తుతం బహిరంగంగా తూటాలు పేలుతున్నాయి, గ్యాంగ్‌స్టర్లు డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు బీజేపీకు సామర్థ్యం లేదు" అని 'ఎక్స్' వేదికగా ఆమె అన్నారు.

    వివరాలు 

    సీఆర్పీఎఫ్‌ పాఠశాల వెలుపల తెల్లవారుజామున పేలుడు

    "బీజేపీకి ప్రజలు పొరపాటున ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తే ఆస్పత్రులు, విద్యుత్‌, నీటి సరఫరాలో ఆటంకాలు ఉంటాయని" పేర్కొన్నారు.

    కాగా, రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వెలుపల తెల్లవారుజామున పేలుడు సంభవించింది.

    ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక శాఖ, క్రైమ్, ఎఫ్‌ఎస్ఎల్ బృందాలు, బాంబు డిస్పోజల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.

    వివరాలు 

    బీజేపీ కౌంటర్ 

    ఈ పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు, కానీ పేలుడు ధాటికి పాఠశాల గోడ కూలిపోయింది.

    శబ్ద తీవ్రతకు సమీపంలోని కారు అద్దాలు పగిలిపోయాయి. దుకాణాలు కూడా దెబ్బతిన్నాయి.

    ఈ ఘటనపై స్పందించిన సీఎం అతిషీ బీజేపీపై మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది.

    "తోలుబొమ్మ సీఎం" అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. "సమస్య పరిష్కారం గురించి ఆలోచించకుండా రాజకీయాలు చేయడం సరికాదు" అని వ్యాఖ్యానించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అతిషి మార్లెనా
    బీజేపీ

    తాజా

    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్
    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్
    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్

    అతిషి మార్లెనా

    Delhi Water Crisis: క్షిణించిన అతిషి ఆరోగ్యం.., ఆస్పత్రికి తరలింపు  భారతదేశం
    Coaching Centres: కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టం  భారతదేశం
    Atishi Marlena: ఏపీలో టీచర్‌ గా పని చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. ఆ స్కూల్ ఎక్కడుందంటే! భారతదేశం
    Atishi: సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం  భారతదేశం

    బీజేపీ

    Bjp-Bengal-TMC-SandeshKhali: బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ ల మాటలయుద్ధం పశ్చిమ బెంగాల్
    AP-Amith Sha-Election Campaign: గూండాగిరి, అవినీతిని అంతం చేయడానికే పొత్తు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్ షా
    BJP: బీజేపీలో చేరిన రాధిక ఖేడా, నటుడు శేఖర్ సుమన్  భారతదేశం
    PM Modi invites NDA: ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఎన్సీపీ, శివసేనలకు మోదీ ఆహ్వానం నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025