NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రుణాల ఎగవేత కారణంగా వైసీపీ ఎమ్మెల్యే ఆస్తుల వేలం
    తదుపరి వార్తా కథనం
    రుణాల ఎగవేత కారణంగా వైసీపీ ఎమ్మెల్యే ఆస్తుల వేలం
    రుణాల ఎగవేత కారణంగా వైసీపీ ఎమ్మెల్యే ఆస్తుల వేలం

    రుణాల ఎగవేత కారణంగా వైసీపీ ఎమ్మెల్యే ఆస్తుల వేలం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 21, 2023
    04:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గట్టి షాక్ తగిలింది. కెనరా బ్యాంకు అతని ఆస్తులను వేలం వేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటనను విడుదల చేసింది.

    ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీదారుగా ఉన్న కంపెనీ తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేదు. దీంతో ఆగస్టు 18న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది.

    ఏప్రిల్ 30 నాటికి వడ్డీతో కలిపి రూ.908 కోట్లు అయినట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఆస్తులన్నీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

    మెసర్స్ సాయిసుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. అయితే వాటిని ఆ కంపెనీ చెల్లించలేదు.

    Details

    నోటీసులకు స్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

    2005 డిసెంబరులో ఏఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ కంపెనీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొదట్లో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నట్లు సమాచారం. తర్వాత శ్రీధర్‌రెడ్డి రాజీనామా చేశారు.

    2014లో ఆయన భార్య అపర్ణరెడ్డి డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టారు. తమ కంపెనీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చేపట్టిన పనులను చేసిందని, అయితే ఆ పనులకు సంబంధించి బిల్లులు మంజూరు కాకపోవడంతో సకాలంలో వడ్డీలు చెల్లించలేదని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చెబుతున్నారు.

    రుణాల కోసం తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని కెనరా బ్యాంకు నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులకు స్పందించకపోవడంతోనే ఆస్తుల వేలానికి సిద్ధమైనట్లు బ్యాంకు చెబుతోంది.

    షూరిటీగా పెట్టిన ఆస్తుల్లో ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని భూములు ఉన్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    తాజా

    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి
    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్

    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు అంబటి రాంబాబు
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025