NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengaluru Bomb Blast: బెంగళూరు పేలుడు ఘటనలో కీలక పరిణామం.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు 
    తదుపరి వార్తా కథనం
    Bengaluru Bomb Blast: బెంగళూరు పేలుడు ఘటనలో కీలక పరిణామం.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు 
    బెంగళూరు పేలుడు ఘటనలో కీలక పరిణామం.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు

    Bengaluru Bomb Blast: బెంగళూరు పేలుడు ఘటనలో కీలక పరిణామం.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 02, 2024
    08:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత,కర్ణాటక రాజధానిలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని కేఫ్ ప్రాంగణంలో ఒక వ్యక్తి బ్యాగ్‌తో వెళ్తున్నట్లు చూపించే CCTV ఫుటేజీ బయటపడింది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,నిందితుడు,ఓ బ్యాగ్‌ను కేఫ్‌లో ఉంచి, పేలుడు జరగడానికి ముందు వెళ్లిపోయాడు.

    అనుమానితుడితో పాటు కనిపించిన మరో వ్యక్తిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

    ప్రధాన నిందితుడు, అతని ముఖాన్ని ముసుగు,అద్దాలు,తలను టోపీతో దాచిపెట్టి,ఇడ్లీల ప్లేట్‌తో కేఫ్‌లో సీసీ కెమెరాలలో కనిపించాడు.

    శుక్రవారం మధ్యాహ్నం 12.50 నుంచి 1 గంటల మధ్య జరిగిన ఈ పేలుడు ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.

    Details 

    నిందితుడిని గుర్తించినట్టు తెలిపిన డిప్యూటీ సీఎం 

    ఘటనాస్థలికి చేరుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ క్షుణ్ణంగా విచారణ చేపట్టారు.కేఫ్ సిబ్బందితో సహా గాయపడిన వారు ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.

    ఈ ఘటనను రాజకీయం చేయవద్దని,ప్రస్తుతం జరుగుతున్నవిచారణకు సహకరించాలని,కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలను కోరారు.ఐఈడీ కారణంగా ఈపేలుడు సంభవించి ఉండవచ్చని అయన మీడియాకు తెలిపారు.

    హోంమంత్రి జి పరమేశ్వరతో కలిసి పేలుడు ప్రదేశాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ పేలుడుకు దారితీసిన సంఘటనల క్రమం గురించి కీలకమైన వివరాలను అందించారు. "మధ్యాహ్నం 1 గంటలకు పేలుడు సంభవించింది.సుమారు 28-30సంవత్సరాల యువకుడు కేఫ్‌కు వచ్చి,కౌంటర్‌లో రవ్వ ఇడ్లీ కోసం కూపన్ తీసుకున్న నిందితుడు అది తినకుండానే తన బ్యాగ్‌ను అక్కడ వదిలేసి వెళ్లిపోయాడని..ఒక గంట తర్వాత పేలుడు సంభవించింది" అని శివకుమార్ చెప్పారు.

    Details 

    దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సిసిబి

    సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) దర్యాప్తు బాధ్యతలు చేపట్టింది. ఫోరెన్సిక్ బృందాలు ప్రస్తుతం ఘటనాస్థలిని పరిశీలించి సాక్ష్యాలను సేకరించి, ఉపయోగించిన పేలుడు పరికరం స్వభావాన్ని నిర్ధారించారు.

    NSG కమాండోలు, బాంబ్ స్క్వాడ్‌లు నేటి ఉదయం కూడా ఆ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    బెంగళూరు

    ఈనెలలోనే పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ .. హైదరాబాద్‌-బెంగళూరు రైలు టైమింగ్స్ ఇవే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్ అత్యాచారం
    స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టూర్ ప్లాన్ చేస్తున్నారా? బెంగళూరు దగ్గర్లోని చూడాల్సిన ప్రదేశాలు ఇవే  పర్యాటకం
    చందమామ దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3, ఆగస్ట్ 23న జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్  చంద్రయాన్-3
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025