Bengaluru: బెంగుళూరులో దారుణం.. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దారుణ హత్య
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం (ఆగస్టు 28) టెర్మినల్ 1లోని పార్కింగ్ ఏరియా దగ్గర ఒక ఉద్యోగి బహిరంగంగా కత్తితో పొడిచి దారుణ హత్య చేశారు. ఈ హత్యాకాండతో విమానాశ్రయంలో భయానక వాతావరణం నెలకొంది. మృతుడిని రామకృష్ణ (45)గా గుర్తించారు. రామకృష్ణ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ట్రాలీ పుల్లర్గా పనిచేసేవాడు. మృతుడికి తన భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు నిందితుడు అనుమానించాడు. ఈ వ్యక్తిగత కక్షల కారణంగానే ఆయనపై దాడి జరిగింది. పార్కింగ్ ప్రాంతంలో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
నిందితుడిని పట్టుకున్న సీఐఎస్ఎఫ్
విమానాశ్రయ భద్రత బాధ్యతలు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) వెంటనే నిందితుడిని పట్టుకుంది. అతడిని రమేష్గా గుర్తించారు. ఆ తర్వాత బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL) పోలీసులకు అప్పగించారు. నిందితుడి భార్యతో బాధితుడు రామకృష్ణ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రామకృష్ణ, రమేష్ ఇద్దరూ కర్ణాటకలోని తుమకూరు జిల్లా వాసులు. 'డక్కన్ హెరాల్డ్' కథనం ప్రకారం, రమేష్ మధుగిరి నుండి KSRTC బస్సు ఎక్కి యలహంకలో దిగాడు. అనంతరం బీఎంటీసీ బస్సు ఎక్కి విమానాశ్రయం వైపు వెళ్లాడు. విమానాశ్రయానికి చేరుకోగానే పార్కింగ్లో రామకృష్ణ ట్రాలీలు దింపుతుండటం చూశాడు. ఆపై అతనిపై దాడి చేశాడు.
టెర్మినల్ 1 అరైడ్స్ పార్కింగ్ ప్రాంతంలో హత్య
బెంగళూరు నగరంలోని ఈశాన్య విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ 'ఇండియా టుడే'తో మాట్లాడుతూ.. నిందితులు కత్తిని కాలేజీ బ్యాగ్లో ఉంచినట్లు తెలిపారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సులో విమానాశ్రయానికి వెళ్లారు. అతను బస్సులో ప్రయాణిస్తున్నందున, అతని బ్యాగ్ స్కాన్ చేయలేదు. టెర్మినల్ 1 (లేన్ 1) పార్కింగ్ ఏరియాలోని వాష్రూమ్ సమీపంలో ఈ ఘటన జరిగిందని డీసీపీ తెలిపారు.