
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఆనందం కేవలం కొన్ని గంటలపాటు మాత్రమే నిలిచింది.
ఆటగాళ్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
ఈ నేపథ్యంలో తీవ్ర తొక్కిసలాట (Bengaluru Stampede) చోటుచేసుకుంది.
ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ విషయంపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
కాగా, నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అదనంగా, ఈ తొక్కిసలాటలో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు
#BreakingNews | #Karnataka HC to hear stampede case at 2:30pm.
— News18 (@CNNnews18) June 5, 2025
Karnataka law officer to submit report based on facts @harishupadhya @toyasingh | #BengaluruStampede pic.twitter.com/HprLOWOFjr