NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం
    తదుపరి వార్తా కథనం
    'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం
    'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం

    'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం

    వ్రాసిన వారు Stalin
    Jun 19, 2023
    10:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ నుంచి గుర్బానీని అందరికీ ఉచితంగా ప్రసారం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    పంజాబ్ ప్రభుత్వం సిక్కు గురుద్వారా చట్టం, 1925ను సవరించనున్నట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు.

    గుర్బానీ అనేది ఒక పవిత్రమైన శ్లోకం. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు భక్తితో వింటారు.

    ప్రస్తుతం ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్ మాత్రమే గుర్బానీని ప్రసారం చేసేందుకు హక్కులను పొందింది. ఎంతో పవిత్రమైన ఈ శ్లోకాన్ని ఒక ఛానెల్‌కు మాత్రమే పరిమితం చేయకుండా, సర్వజన సంక్షేమ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని సీఎం మాన్ అన్నారు.

    అందుకే 'సర్బ్ సంజీ గుర్బానీ'ని ప్రచారం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

    పంజాబ్

    జూన్ 20న గుర్బానీ ఉచిత టెలికాస్ట్‌పై తీర్మానం

    ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం జూన్ 20న ప్రత్యేక సెషన్‌లో గుర్బానీ ఉచిత టెలికాస్ట్‌పై అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనుందని సీఎం మాన్ ప్రకటించారు.

    భక్తులందరి డిమాండ్ మేరకు, అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ హర్మీందర్ సాహిబ్ నుంచి గుర్బానీని ఉచితంగా ప్రసారం చేయడానికి గురుద్వారా చట్టం 1925లో కొత్త నిబంధనను చేర్చబోతున్నట్లు వెల్లడించారు.

    దీనికి ఇక మీదట ఎలాంటి టెండర్ అవసరం లేదన్నారు. విదేశాల్లో ఉన్నా ఇంట్లో కూర్చొని గుర్బానీని వినడానికి 'సంగత్'కు అవకాశం కల్పించడంలో ఈ చర్య చాలా దోహదపడుతుందని సీఎం మాన్ అన్నారు.

    ప్రజలు తమ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో కూడా శ్రీ హర్మందర్ సాహిబ్ గుర్బానీని వినొచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.

    పంజాబ్

    పంజాబ్ ప్రభుత్వానికి చట్టాన్ని సవరించే హక్కు లేదు: ఎస్‌జీపీసీ

    ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీసుకున్న నిర్ణయంపై సిక్కుల అత్యున్నత మత సంస్థ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(ఎస్‌జీపీసీ) తీవ్రంగా స్పందించింది.

    మతపరమైన విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని కోరింది. పంజాబ్ ప్రభుత్వానికి ఈ చట్టాన్ని సవరించే హక్కు లేదని ఎస్‌జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామీ ట్వీట్ చేశారు.

    రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని గందరగోళానికి గురి చేయవద్దన్నారు. సిక్కుల మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దన్నారు.

    సిక్కు వ్యవహారాలు సంగత్‌ల మనోభావాలకు సంబంధించినవని, ప్రభుత్వాలకు నేరుగా జోక్యం చేసుకునే హక్కు లేదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భగవంత్ మాన్
    పంజాబ్
    ప్రభుత్వం
    అమృత్‌సర్

    తాజా

    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్
    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం

    భగవంత్ మాన్

    పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుమార్తెకు ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులు పంజాబ్
    అమృత్‌పాల్‌ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే! పంజాబ్

    పంజాబ్

    ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్ ఆస్ట్రేలియా
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ
    అమృతపాల్ సింగ్‌ అరెస్టుకు ఆపరేషన్ షురూ: ఇంటర్నెట్ బంద్; పంజాబ్‌లో ఉద్రిక్తత ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ప్రభుత్వం

    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం జమ్మూ
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  నరేంద్ర మోదీ
    తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం  తెలంగాణ
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్

    అమృత్‌సర్

    అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన అతని మామ, డ్రైవర్ పంజాబ్
    'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు పంజాబ్
    భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు పంజాబ్
    పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా? పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025