NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rammohan Naidu: 2026 జూన్‌ కల్లా భోగాపురం విమానాశ్రయం సిద్ధం: రామ్మోహన్‌ నాయుడు 
    తదుపరి వార్తా కథనం
    Rammohan Naidu: 2026 జూన్‌ కల్లా భోగాపురం విమానాశ్రయం సిద్ధం: రామ్మోహన్‌ నాయుడు 
    2026 జూన్‌ కల్లా భోగాపురం విమానాశ్రయం సిద్ధం: రామ్మోహన్‌ నాయుడు

    Rammohan Naidu: 2026 జూన్‌ కల్లా భోగాపురం విమానాశ్రయం సిద్ధం: రామ్మోహన్‌ నాయుడు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 11, 2024
    02:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శంషాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి వెనుక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి కీలకమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

    అప్పట్లో 5 వేల ఎకరాల భూసేకరణ సాధించడంలో ఆయన పాత్ర సామాన్య విషయం కాదని గుర్తు చేశారు.

    శంషాబాద్ నోవాటెల్‌లో నిర్వహించిన ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల కాన్సెప్ట్ వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారని పేర్కొన్నారు.

    దేశంలో ఐటీ విప్లవానికి ఆయన చేసిన కృషి దేశాభివృద్ధికి చోదకశక్తిగా నిలిచిందని, ఇప్పటికీ చంద్రబాబు ఐటీని అభివృద్ధి హేతువుగా నమ్ముతారని తెలిపారు.

    విమానాశ్రయాల నిర్వహణలో అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి సేవలు మెరుగుపరుస్తున్నామని, డేటా అనలిటిక్స్ ఉపయోగించి సరికొత్త సేవలను అందిస్తున్నామని వివరించారు.

    వివరాలు 

    24 విమానాశ్రయాల్లో డిజియాత్ర టెక్నాలజీ 

    అదే విధంగా, దేశంలోని 24 విమానాశ్రయాల్లో డిజియాత్ర టెక్నాలజీ అమలు చేస్తున్నామని, విమానాశ్రయాలను కేవలం రవాణా సౌకర్యాలు మాత్రమే కాకుండా ఉపాధి మార్గాలు, సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

    ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో విమానయాన శాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచం భారత్ వైపు చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

    వరంగల్, భోగాపురం విమానాశ్రయాలను త్వరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి అవుతుందని, వచ్చే ఐదేళ్లలో 50 విమానాశ్రయాలను పెంచడమే లక్ష్యమని చెప్పారు.

    ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభం మరో మైలురాయి అని ఆయన పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    Bharatiya Vayuyan Vidheyak 2024: బ్రిటిష్ కాలం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో కొత్త ఏవియేషన్ బిల్లు  కేంద్ర పౌర విమానయాన శాఖ
    Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్‌ నాయుడు రాజమహేంద్రవరం
    Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడి పేరు  విజయనగరం
    Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్ బాంబు బెదిరింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025