NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేడు దిల్లీ వేదికగా మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు
    తదుపరి వార్తా కథనం
    నేడు దిల్లీ వేదికగా మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు
    నేడు దిల్లీ వేదికగా మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు

    నేడు దిల్లీ వేదికగా మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 08, 2023
    10:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇవాళ దిల్లీ చేరనున్నారు. ఈ మేరకు గురువారం అమెరికాలో గురువారం బయల్దేరిన బైడెన్, శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు దిల్లీ చేరుకోనున్నారు.

    అనంతరం భారత్- అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఇందులో భాగంగానే జీఈ( GE-GENERAL ELECTRIC) జెట్ ఇంజన్లు, న్యూక్లియర్ టెక్నాలజీపై పురోగతి సాధించేలా ప్రధానంగా చర్చించనున్నట్లు వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ గురువారం ప్రకటించారు.

    G-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న అగ్రరాజ్యధిపతి, నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

    ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీలో జరిగే ప్రతిష్టాత్మకమైన సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తోంది.

    DETAILS

    భారతదేశంలోనే జెట్ ఇంజిన్ల తయారీకి ఇటీవలే అమెరికా గ్రీన్ సిగ్నల్

    గతంలోనే జనరల్ ఎలక్ట్రిక్ (GE) ఏరోస్పేస్ యూనిట్ భారతదేశంలోనే జెట్ ఇంజిన్లను సంయుక్తంగా తయారు చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

    భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్‌లకు శక్తినిచ్చే ఇంజిన్‌లను భారత్ లోనే తయారు చేసేందుకు ఇటీవలే అమెరికా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇవాళ తాజాగా వీటిపై మరింత పురోగతి సాధించనున్నారు.

    ఇదే సమయంలో పర్యావరణ మార్పులు, రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధం, ఆర్థిక సహకారం, బహుళపాక్షిక అభివృద్ధి బ్యాంకు సంస్కరణలు, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం, పేదరికాన్ని జయించడం లాంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సుల్లివన్ వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    అమెరికా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    భారతదేశం

    భారత్ భళా..2030 నాటికి ఉపాధి రంగంలో మరో ఘనత : మెకిన్సే నివేదిక ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు
    వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని చెప్పాను: కాంగ్రెస్ విమర్శలకు మోదీ జవాబు  నరేంద్ర మోదీ
    యూనిఫామ్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు: సిబ్బందికి సీఆర్పీఎఫ్ హెచ్చరిక  భారతదేశం
    'భారత్- పాక్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులే కాదు.. మేం కూడా ఎంజాయ్ చేస్తాం' ఆసియా కప్

    అమెరికా

    చైనాపై అమెరికా ఆంక్షలు.. సాంకేతిక పెట్టుబడులపై నిషేధాజ్ఞలు జో బైడెన్
    అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ కలకలం.. కొవిడ్ కేసుల్లో ఈజీ5ది 17 శాతం  కరోనా వేరియంట్
    ఉత్తర కొరియా టాప్ జనరల్ తొలగింపు.. యుద్ధానికి సిద్ధం కావాలని కిమ్ జోంగ్ పిలుపు ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    అమెరికా హవాయి ద్వీపంలో కారుచిచ్చు .. సముద్రంలోకి దూకేస్తున్న ప్రజలు, 36 మంది మృత్యువాత జో బైడెన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025