Page Loader
జి20 శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు కావడంపై జో బైడెన్ నిరాశ
జి20 శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు కావడంపై జో బైడెన్ నిరాశ

జి20 శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు కావడంపై జో బైడెన్ నిరాశ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2023
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ జీ20కి శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకూడదని తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిరాశ వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆదివారం డేలావేర్‌లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బైడెన్‌ స్పందిస్తూ.. ''నేను నిరుత్సాహనికి గురయ్యాను.. కానీ, నేను ఆయనను కలిసేందుకు వెళుతున్నాను'' అని తెలిపారు. సెప్టెంబర్‌ 7-10 మధ్యలో బైడెన్‌ జీ20 సదస్సు పర్యటనకు హాజరవుతారు. అనంతరం వియత్నాంలో పర్యటిస్తారు. ఈ రెండు పర్యటనలపై బైడెన్‌ స్పందిస్తూ.. భారత్ ,వియాత్నం దేశాలతో మరింత సమన్వయం చేసుకోవాల్సి ఉందన్నారు. అదే సమయంలో ఆయా దేశాలతో కూడా అమెరికాతో సంబంధాలను బలపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు.

Details 

ఆసియా-పసిఫిక్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ సదస్సులో బైడెన్‌-జిన్‌పింగ్‌ భేటీకి అవకాశం 

అంతకముందు భారత్‌ వెళతానని జిన్‌పింగ్‌ వెల్లడించారు. కానీ, చైనా విదేశాంగ శాఖ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ అనంతరం జిన్‌పింగ్‌ ఈ ఏడాది జీ20కి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ వారంలో జరగనున్న సదస్సుకు తన ప్రతినిధిగా చైనా ప్రీమియర్‌ లి కియాంగ్‌ను పంపాలని జిన్‌పింగ్‌ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. చివరిసారిగా బైడెన్‌-జిన్‌పింగ్‌ గతేడాది బాలిలో జరిగిన సదస్సులో కలిశారు. ఈ ఏడాది నవంబర్‌లో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆసియా-పసిఫిక్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు జిన్‌పింగ్‌ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సదస్సులో బైడెన్‌-జిన్‌పింగ్‌ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.