NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Big Standoff at Attari: సొంతదేశ ప్రజల్ని అనుమతించని పాకిస్తాన్.. అట్టారీ-వాఘా వద్ద ఉద్రిక్తత
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Big Standoff at Attari: సొంతదేశ ప్రజల్ని అనుమతించని పాకిస్తాన్.. అట్టారీ-వాఘా వద్ద ఉద్రిక్తత
    సొంతదేశ ప్రజల్ని అనుమతించని పాకిస్తాన్.. అట్టారీ-వాఘా వద్ద ఉద్రిక్తత

    Big Standoff at Attari: సొంతదేశ ప్రజల్ని అనుమతించని పాకిస్తాన్.. అట్టారీ-వాఘా వద్ద ఉద్రిక్తత

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ రోజురోజుకి దిగజారిపోతోంది. సొంత దేశ పౌరులకే సరిహద్దు దాటేందుకు అనుమతిని నిరాకరిస్తోంది.

    భారతదేశం నుంచి స్వదేశమైన పాకిస్తాన్‌కు ప్రయాణించే పౌరులకు కూడా ఎంట్రీ ఇవ్వకుండా ఆదేశించింది.

    ఈ చర్యల నేపథ్యంలో అట్టారీ-వాఘా సరిహద్దులో దౌత్య సంబంధాలు ప్రతిష్టంభనకు గురయ్యాయి.

    ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో పాకిస్తాన్ తన రీసీవింగ్ కౌంటర్లను మూసివేసిందని భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు అధికారికంగా తెలిపారు.

    దీని ప్రభావంగా అనేక మంది పాకిస్తానీ పౌరులు సరిహద్దులోనే చిక్కుకుపోయారు.

    వీరిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా ఉండటంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. వారు ఆశ్రయం లేకుండా, ఆహారం లేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు.

    వివరాలు 

    మానవతావాదంతో స్పందించిన భారత్‌

    పాకిస్తాన్ అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ దేశ పౌరులే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఇది తమకే అన్యాయంగా ఉందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో అట్టారీ సరిహద్దు వద్ద భద్రతను భారత అధికారులు మరింతగా కట్టుదిట్టం చేశారు.

    మరోవైపు, పాకిస్తాన్ తీసుకున్న ఈ వైఖరికి విరుద్ధంగా భారత్ మాత్రం మానవతావాదంతో స్పందించింది.

    తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పాకిస్తాన్ పౌరులు అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వెళ్లేందుకు అనుమతిని కొనసాగించింది.

    గతంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఏప్రిల్ 30వ తేదీలోగా భారత్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

    అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఆదేశాలను కేంద్రం సవరించింది.

    వివరాలు 

    పాకిస్తాన్ నుంచి తిరిగి భారత్‌కు వచ్చిన 1500 మంది..

    ఈ ఆదేశాలు అమలులోకి వచ్చిన కేవలం ఒక వారం వ్యవధిలోనే సుమారు 800 మంది పాకిస్తానీ పౌరులు, 55 మంది దౌత్యవేత్తలు, వారి సహాయక సిబ్బందితో కలిసి పాకిస్తాన్‌కు తిరిగిపోయారు.

    అదే సమయంలో సుమారు 1500 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి తిరిగి భారత్‌కు వచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్

    పాకిస్థాన్

    NZ vs PAK: మరో 99 పరుగులు చేస్తే సెంచరీ.. బాబర్ అజామ్‌పై ఫన్నీ మీమ్స్ వైరల్! బాబార్ అజామ్
    Pakistan : న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. పాక్ జట్టుకు ఐసీసీ ఊహించని షాక్ ఐసీసీ
    Earthquake: పాకిస్థాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన జనాలు ప్రపంచం
    PSL: ఐపీఎల్‌కు పోటీగా పీఎస్ఎల్..? సెంచరీ కొట్టిన ప్లేయర్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..! క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025