తదుపరి వార్తా కథనం
Bill Gates: భారత పార్లమెంట్ను సందర్శించిన బిల్ గేట్స్.. జేపీ నడ్డాతో కీలక చర్చలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 19, 2025
01:01 pm
ఈ వార్తాకథనం ఏంటి
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్నారు.
తన పర్యటనలో భాగంగా పార్లమెంట్ భవనాన్ని సందర్శించిన ఆయన, కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.
ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సహకారం గురించి చర్చించనున్నారు.
అలాగే, పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గడిచిన మూడేళ్లలో బిల్ గేట్స్ భారత్ను మూడు మార్లు సందర్శించడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్
#WATCH | Delhi | Former Microsoft CEO Bill Gates departs from Parliament after his meeting with Union Minister JP Nadda pic.twitter.com/23nw9w9TKQ
— ANI (@ANI) March 19, 2025