NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amarinder Singh Raja: ఎన్నికల కోసం బీజేపీ ఏమైనా చేయగలదు; పూంచ్ ఉగ్రదాడిపై ప్రశ్నలు  
    తదుపరి వార్తా కథనం
    Amarinder Singh Raja: ఎన్నికల కోసం బీజేపీ ఏమైనా చేయగలదు; పూంచ్ ఉగ్రదాడిపై ప్రశ్నలు  

    Amarinder Singh Raja: ఎన్నికల కోసం బీజేపీ ఏమైనా చేయగలదు; పూంచ్ ఉగ్రదాడిపై ప్రశ్నలు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2024
    11:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ తర్వాత మరో కాంగ్రెస్‌ నాయకుడు, పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌ తాజాగా పూంచ్‌ ఉగ్రదాడిపై అధికార బీజేపీని టార్గెట్‌ చేశారు.

    ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ ఏమైనా చేయగలదని అన్నారు.

    మంగళవారం ఆయన మాట్లాడుతూ, "పుల్వామా దాడి ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయిందన్నారు. దీనిపై అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా ప్రశ్నలు సంధించారన్నారు.

    అమరీందర్‌ సింగ్‌ రాజా లూథియానా స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.

    Details 

    భారత వైమానిక దళానికి చెందిన వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి

    2019 ఫిబ్రవరిలో జైషే మహ్మద్‌ చేసిన పుల్వామా దాడి లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగింది.

    కొన్ని రోజుల తర్వాత, భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ప్రతీకార దాడులు చేసింది.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ వరుసగా రెండోసారి ఎన్నికల్లో మెజారిటీ సాధించాయి.

    ఎన్నికల ప్రయోజనాల కోసం బిజెపి ప్రభుత్వం తీవ్రవాద దాడిని అనుమతించిందని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపించాయి, ఈ అభియోగాన్ని అధికార పార్టీ తిరస్కరించింది.

    గత శనివారం పూంచ్‌లో దాడి జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు.

    ఈ దాడిలో ఒక సైనికుడు వీరమరణం పొందాడు. ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతమంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

    Details 

    ఎన్నికలలో బీజేపీని గెలిచేందుకే ఈ విన్యాసాలు

    ఈ దాడి జరిగిన ఒక రోజు తర్వాత, జలంధర్ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ బిజెపి ప్రభుత్వం తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

    ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీని గెలిపించేందుకు ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారు. ఇవి ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడులని, ఇందులో వాస్తవం లేదన్నారు.

    తన ప్రకటనపై వివాదం ప్రారంభమైన తర్వాత, మాజీ సీఎం వెనక్కి తగ్గారు.

    Details 

    బీజేపీ రాజకీయ స్టంట్‌ 

    దేశాన్ని రక్షించేందుకు సాయుధ దళాల్లో చేరిన సైనికులను చూసి తాను గర్విస్తున్నానని అన్నారు.

    పుల్వామా ఘటనకు పాల్పడిన నేరస్తులను ఇప్పటి వరకు ప్రభుత్వం గుర్తించలేదని ఆయన అన్నారు.

    దోషులు ఎవరు అని నేను అడగాలనుకుంటున్నాను? వారికి ఎందుకు న్యాయం జరగలేదు? నిఘా వైఫల్యాలు ఎందుకు జరుగుతున్నాయి? మరోసారి సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, దీన్ని బిజెపి ఎందుకు రాజకీయ స్టంట్‌గా చేస్తోంది? అని ప్రశ్నించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    కాంగ్రెస్

    Varun Gandhi: వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ.. కాంగ్రెస్ ఆఫర్..  బీజేపీ
    Punjab: పంజాబ్ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ.. బీజేపీలో చేరిన రవ్‌నీత్ సింగ్ బిట్టు  పంజాబ్
    Supriya Shrinate: కంగనా రనౌత్ పై వివాస్పద వ్యాఖ్యలు.. ఎంపీ టికెట్ కోల్పోయిన సుప్రియ శ్రీనేత్  భారతదేశం
    Rahul Gandhi: కాంగ్రెస్ 50% ప్రభుత్వ ఉద్యోగాలను మహిళలకు రిజర్వ్ చేస్తుంది  : రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025