NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు 
    తదుపరి వార్తా కథనం
    సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు 
    సోనియా గాంధీపై వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు

    సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు 

    వ్రాసిన వారు Stalin
    May 08, 2023
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్‌కు చేరింది. వాడివేడీగా మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.

    'కర్ణాటక సార్వభౌమాధికారం'పై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ సోమవారం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.

    బీజేపీ ప్రతినిధి బృందం దేశ రాజధానిలోని పోల్ ప్యానెల్ కార్యాలయానికి వెళ్లింది. సోనియా గాంధీ ఉద్దేశపూర్వకంగా సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించారని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 'తుక్డే-తుక్డే' గ్యాంగ్ ఎజెండా అని అందుకే ఇలాంటి పదాలు వాడుతున్నారని, ఈసీ చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు.

    బీజేపీ

    ఇంతకీ సోనియా గాంధీ ఏమన్నారంటే?

    కర్ణాటకలోని హుబ్బలి జిల్లాలో జరిగిన ర్యాలీలో శనివారం సోనియా గాంధీ ప్రసంగించారు. దీన్ని కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది.

    6.5 కోట్ల మంది కన్నడిగులకు బలమైన సందేశాన్ని పంపారని, కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం లేదా సమగ్రతకు ముప్పు కలిగించడానికి కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదని ఆ పోస్టులో సోనియా గాంధీ చెప్పినట్లు ఉంది.

    ఇదిలా ఉంటే, భారతదేశం నుంచి కర్ణాటకను వేరుచేయాలని కాంగ్రెస్ బహిరంగంగా వాదిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించిన తర్వాతి రోజే బీజేపీ సోనియాపై చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం గమనార్హం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కర్ణాటకలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు

    CPP Chairperson Smt. Sonia Gandhi ji sends a strong message to 6.5 crore Kannadigas:

    "The Congress will not allow anyone to pose a threat to Karnataka's reputation, sovereignty or integrity." pic.twitter.com/W6HjKYWjLa

    — Congress (@INCIndia) May 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    సోనియా గాంధీ
    కాంగ్రెస్
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం
    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం

    కర్ణాటక

    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు బీజేపీ
    హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్ హర్యానా
    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం
    కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక నరేంద్ర మోదీ

    సోనియా గాంధీ

    'అప్పటి వరకు టీషర్ట్ మీదనే ఉంటా'.. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ ఆసక్తికర కామెంట్స్ భారతదేశం
    రాహుల్ భద్రతపై కాంగ్రెస్ అనుమానాలు.. కేంద్రం ఏం అంటోంది? భారతదేశం
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్

    కాంగ్రెస్

    రాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? నిపుణులు ఏం అంటున్నారు? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు రాహుల్ గాంధీ
    Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ కర్ణాటక

    అసెంబ్లీ ఎన్నికలు

    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? త్రిపుర
    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా త్రిపుర
    నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం నాగాలాండ్
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ త్రిపుర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025