NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి? 
    తదుపరి వార్తా కథనం
    2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి? 
    2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి?

    2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 08, 2023
    03:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీజేపీ,జనతాదళ్(సెక్యులర్)2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో చేతులు కలపడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

    జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఇటీవల బీజేపీ చీఫ్ జేపీ నడ్డా,హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై కూటమి నిర్మాణంపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

    జూన్ 1996,ఏప్రిల్ 1997 మధ్య ప్రధానిగా ఉన్న హెచ్‌డి దేవెగౌడ కర్ణాటకలో ఐదు లోక్‌సభ స్థానాలను కోరుతున్నారు.

    ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తుది నిర్ణయం తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

    మరిన్ని చర్చలు పైప్‌లైన్‌లో ఉన్నప్పటికీ, దేవెగౌడ, హెచ్‌డి కుమారస్వామి జెడి (ఎస్) స్టేక్ హోల్డర్స్ ను కలిసిన తర్వాత మాత్రమే బిజెపితో ఈ ప్రతిపాదనను ముందుకు కదిలించినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా.

    Details 

    లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తాం: దేవెగౌడ 

    జేడీ(ఎస్) నేతలు ఏకాభిప్రాయం (సీట్ షేరింగ్‌పై)ఇచ్చారని వర్గాలు ధృవీకరించాయి.

    JD(S) అడిగిన ఐదు లోక్‌సభ స్థానాలు మాండ్య,హాసన్,తుమకూరు,చిక్‌బల్లాపూర్,బెంగళూరు రూరల్. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎతో ఎన్నికల పొత్తును నిరాకరిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని జూలైలో దేవెగౌడ చెప్పిన కొన్ని నెలల తర్వాత ఈ చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

    మేం (పార్టీ) ఐదు,ఆరు,మూడు,రెండు లేదా ఒక సీట్లు గెలిచినా..లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తాం'' అని అప్పట్లో దేవెగౌడ చెప్పారు.

    కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా,పార్టీ బలపరిచిన అభ్యర్థి కూడా విజయం సాధించారు.

    కాంగ్రెస్,జేడీ(ఎస్)లు ఒక్కో సీటును దక్కించుకున్నాయి.జేడీ(ఎస్)కంచుకోట హాసన్‌లో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కర్ణాటక

    కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య సిద్ధరామయ్య
    బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ! బీజేపీ
    తల్లిని చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన మహిళ  బెంగళూరు
    బెంగళూరులో భారీ వర్షాలు; తోతట్టు ప్రాంతాలు జలమయం  బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025