NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. నడిరోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన ప్రత్యర్థులు
    తదుపరి వార్తా కథనం
    ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. నడిరోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన ప్రత్యర్థులు
    నడిరోడ్డుపై కాల్చి చంపిన ప్రత్యర్థులు

    ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. నడిరోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన ప్రత్యర్థులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 11, 2023
    01:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. సంభాల్‌ కు చెందిన బీజేపీ నేతను పాశవికంగా హత్య చేశారు.

    గురువారం సాయంత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి కాల్పులు జరిపారు.

    ఆకస్మాత్తుగా జరిపిన కాల్పుల్లో అనుజ్ చౌదరి అక్కడికక్కడే ప్రాణం విడిచారు. 34 ఏళ్ల భారతీయ జనతా పార్టీ నేత మొరదాబాద్‌ లోని తన అపార్ట్‌మెంట్‌ వద్ద ఓ వ్యక్తితో కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు.

    ఈ క్రమంలోనే బైక్ పై వెనుక నుంచి వేగంగా వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనపై పాశవికంగా కాల్పులు జరిపారు. దీంతో బాధితుడు కుప్పకూలిపోయాడు.

    చౌదరితో కలిసి నడుస్తున్న వ్యక్తి వెంటనే ప్రాణభయంతో పరుగు లంకించుకున్నాడు.

    details

    కుటుంబ సభ్యులపైనే అనుమానాలు

    ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాలుపంచుకున్నారు. కాగా అందులో ఇద్దరు వాహనం దిగి చౌదరిపై వరుసగా కాల్పులు చేశారు. మరో వ్యక్తి వాహనాన్ని నడిపిస్తుండటం గమనార్హం.

    కాల్పుల మోతతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతన్న అనుజ్‌ చౌదరిని స్థానికులు హుటాహుటిన మొరదాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చౌదరి కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు.

    హత్య కేసులో కుటుంబీకులు అమిత్‌ చౌదరి, అనికేత్‌లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    మరోవైపు నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులే ఈ ఘోరానికి ఒడిగట్టారని చౌదరి కుటుంబం అంటోంది. హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ
    MI vs DC Predicted Playing XI: ప్లేఆఫ్స్ కోసం డూ ఆర్ డై పోరు.. ముంబై-ఢిల్లీ జట్లలో కీలక మార్పులు ముంబయి ఇండియన్స్
    Kolkatta: కోల్‌కతాలో డ్రోన్ల కలకలం.. విచారణ చేపట్టిన పోలీసులు కోల్‌కతా
    Amazon: అమెజాన్ డ్రోన్ డెలివరీతో ఒక్క గంటలో ఇంటి వద్దకి ఐఫోన్? అమెజాన్‌

    ఉత్తర్‌ప్రదేశ్

    కారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ అస్సాం/అసోం
    జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు తాజా వార్తలు
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025