NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amit Shah: కేజ్రీవాల్ దుబారా ఖర్చులపై బీజేపీ ఆగ్రహం.. దిల్లీలో ముదిరిన రాజకీయ వేడి
    తదుపరి వార్తా కథనం
    Amit Shah: కేజ్రీవాల్ దుబారా ఖర్చులపై బీజేపీ ఆగ్రహం.. దిల్లీలో ముదిరిన రాజకీయ వేడి
    కేజ్రీవాల్ దుబారా ఖర్చులపై బీజేపీ ఆగ్రహం.. దిల్లీలో ముదిరిన రాజకీయ వేడి

    Amit Shah: కేజ్రీవాల్ దుబారా ఖర్చులపై బీజేపీ ఆగ్రహం.. దిల్లీలో ముదిరిన రాజకీయ వేడి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 04, 2025
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో రాజకీయాలు వేడక్కాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

    అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ శనివారం 29 మంది అభ్యర్థులతో తన తొలి జాబితాను విడుదల చేసింది.

    కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇదే సమయంలో విమర్శలు, ప్రతివిమర్శలతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

    శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆప్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఆప్‌ను దేశ రాజధానిని దశాబ్ద కాలంగా పట్టిపీడిస్తున్న విపత్తుగా అభివర్ణించారు.

    కేజ్రీవాల్ అభివృద్ధి పేరుతో ప్రజలపై నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

    Details

    అమిత్ షా లక్ష్యంగా కేజ్రీవాల్ విమర్శలు

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కేజ్రీవాల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

    కేజ్రీవాల్ అధికారిక నివాసంపై విపరీతంగా ఖర్చు చేశారని, ప్రభుత్వ సొమ్ముతో అద్దాల రాజభవనం నిర్మించుకున్నారని అమిత్ షా అన్నారు.

    కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం ఏమీ చేయలేదని, అతను విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం ప్రజల సొమ్మును వృథా చేశారని విమర్శలు గుప్పించారు.

    బీజేపీ విమర్శలను ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు.

    గత 10 ఏళ్లలో బీజేపీ దిల్లీలో ఒక్క మంచి పని కూడా చేయలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక 22,000 తరగతి గదులు, మూడు విశ్వవిద్యాలయాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

    Details

    మొదటి జాబితా రిలీజ్ చేసిన బీజేపీ

    బీజేపీ నాయకత్వం ప్రజలకు చేయాల్సిన వాగ్దానాలను గాలిలో కలిపిందని, తమ పాలనలో ప్రజల అవసరాలను తీర్చడానికి అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.

    ఇక బీజేపీ శనివారం 29 మంది అభ్యర్థులతో తొలిజాబితాను విడుదల చేసింది.

    గత ఏడాది పీడబ్ల్యుడీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, కేజ్రీవాల్ అధికారిక నివాసంలో విలాసవంతమైన పునర్నిర్మాణాలు, ఖరీదైన ఉపకరణాలు ఉన్నాయని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    అరవింద్ కేజ్రీవాల్
    ఇండియా

    తాజా

    LIC Guinness record: 24 గంటల్లో 5.88 లక్షల పాలసీలు.. ఎల్‌ఐసీకి గిన్నిస్‌ రికార్డు గౌరవం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
    OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓజీ నుండి ఆసక్తికర అప్డేట్! పవన్ కళ్యాణ్
    Suzuki e-Access: సుజుకీ ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ మార్కెట్లోకి రాకకు సిద్ధం ఆటో మొబైల్
    Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు భారత వాతావరణ శాఖ

    అమిత్ షా

    Amit Shah on POK: పీఓకే మనదే.. కాదనే ధైర్యం కాంగ్రెస్ కు ఉందా: అమిత్ షా  భారతదేశం
    Amit Shah : తొలి దశ ఓటింగ్ తర్వాత ఆందోళన.. విదేశీ ఏజెన్సీల సర్వేపై అమిత్ షా ఏమన్నారంటే ? భారతదేశం
    Amitshah: ఎన్నికల తర్వాత యూసీసీ, ఒకే దేశం ఒకే ఎన్నికలు: అమిత్ షా  భారతదేశం
    Jammu and Kashmir: అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలపై హోం మంత్రి సమీక్ష  జమ్ముకశ్మీర్

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆందోళన.. జూలై 30న ఇండియా బ్లాక్ ర్యాలీ  ఇండియా కూటమి
    Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ  భారతదేశం
    Alderman: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. 'ఎల్‌జీ ఎంసీడీలో ఆల్డర్‌మ్యాన్‌ను నియమించవచ్చు  సుప్రీంకోర్టు
    Arvind kejriwal: ఢిల్లీ హైకోర్టులో నుంచి అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు భారతదేశం

    ఇండియా

    Omar Abdullah: ఎన్నికల్లో ఓడినప్పుడే ఈవీఎంలను తప్పుపట్టడం సరికాదు  జమ్ముకశ్మీర్
    Manipur CM: సీఎం నివాసం దగ్గర బాంబు కలకలం.. భద్రత కట్టుదిట్టం మణిపూర్
    Tulsigowda: వృక్ష ప్రేమికురాలు తులసిగౌడ ఇకలేరు కర్ణాటక
    EPFO: అధిక పింఛనుకు గడువు పెంపు.. పెండింగ్‌లో ఉన్న 3.1 లక్షల దరఖాస్తులకు ఈపీఎఫ్‌ఓ మరో అవకాశం ఈపీఎఫ్ఓ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025