NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ
    భారతదేశం

    కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ

    కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 10, 2023, 10:11 am 1 నిమి చదవండి
    కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ
    కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ

    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నట్లు, అది దక్కకపోవడంతో బాధ, అశాంతితో ఆయన మోదీ, బీజేపీని విమర్శిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్‌వీ సుభాష్ అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ అదానీ సంక్షోభం విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదికపై మోదీ మౌనాన్ని ప్రశ్నించారు. గౌతమ్ అదానీ.. ప్రధానమంత్రి మనిషని చెప్పారు. ప్రధాని బెదిరింపు వ్యూహాలు తెలంగాణలో పనిచేయవని కూడా కేటీఆర్ పేర్కొన్నారు.

    కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు: బీజేపీ

    కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎన్‌వీ సుభాష్ స్పందించారు. బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారని, కేటీఆర్ ఆ విషయాల గురించి మాట్లాడలేడు కాబట్టి, ప్రధాని మోదీ, గౌతమ్ అదానీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన మంత్రికి 'లై డిటెక్టర్' పరీక్ష చేయించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారని ఎన్‌వీ సుభాష్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబం అబద్ధాల పాఠశాలను నడుపుతోందని, వారికే 'లై డిటెక్టర్' పరీక్ష చేయించాలన్నారు. కేటీఆర్ కుటుంబానికి అబద్ధాలు చెప్పే పాఠశాల ఉందని, దానికి కేసీఆర్ ప్రిన్సిపాల్ అని ఆయన అన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    తెలంగాణ
    బీజేపీ

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు; 'ఎండ్యూరింగ్ సింబల్' అవార్డును ప్రధానం చేసిన ఏఎస్‌సీఈ తెలంగాణ
    హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్
    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు హైదరాబాద్
    రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయం : కేటీఆర్ తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్  విద్యుత్
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు  వాతావరణ మార్పులు
    రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా హైదరాబాద్

    బీజేపీ

    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ కాంగ్రెస్
    అనారోగ్యంతో బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత హర్యానా
    కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి కర్ణాటక

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023