Page Loader
"Fake Voters": ఢిల్లీ ఎన్నికలకు ముందు బీజేపీ,ఆప్ పోస్టర్ వార్
ఢిల్లీ ఎన్నికలకు ముందు బీజేపీ,ఆప్ పోస్టర్ వార్

"Fake Voters": ఢిల్లీ ఎన్నికలకు ముందు బీజేపీ,ఆప్ పోస్టర్ వార్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేశ రాజధాని దిల్లీ (Delhi)లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆమ్‌ఆద్మీపార్టీ (AAP),బీజేపీ(BJP) వినూత్నమైన ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఒకరికి చెందిన లోపాలను మరొకరు ఎత్తిచూపుతూ, తమ హామీలతో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ విడుదల చేసిన ఒక పోస్టర్‌కు ఆప్‌ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది (Delhi Elections).

వివరాలు 

 ఆప్‌ 'నకిలీ ఓటర్లపై ప్రేమ'  పోస్టర్‌ 

బీజేపీ ఆమ్‌ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నకిలీ ఓట్లు చేర్చినట్లు, అనేక బోగస్‌ ఓటర్లను అంగీకరించేందుకు కేజ్రీవాల్‌ ప్రయత్నించారని ఆరోపించింది. ఇంటి యజమానికి తెలియకుండా ఈ ఓటర్లను రిజిస్టర్ చేయడం దుర్మార్గమైన చర్య అని ఈ విమర్శ చేసింది. కేజ్రీవాల్ కొత్త విధానం అంటూ అది తీవ్రంగా విమర్శించబడింది. ఈ సందర్భంగా, ఆప్‌ 'నకిలీ ఓటర్లపై ప్రేమ' అనే అర్థాన్ని వ్యక్తం చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఆపై, ఆప్‌ ఈ విమర్శను తిరిగి కొడుతూ, "గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌టైమ్" (GOAT) అని అర్థం వచ్చేలా కేజ్రీవాల్‌ ఉన్న పోస్టర్ వీడియోను పంచుకుంది.

వివరాలు 

మోహన్‌ భాగవత్‌కు అరవింద్ కేజ్రీవాల్  లేఖ

ఇక, దిల్లీలో ఓటర్లకు నగదు పంపిణీ చేయడంపై ఆమ్‌ఆద్మీపార్టీ ఇటీవలే బీజేపీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అరవింద్ కేజ్రీవాల్ ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు మోహన్‌ భాగవత్‌కు ఒక లేఖ రాశారు. ఆరెస్సెస్‌ ఆధ్వర్యంలో కమలం పార్టీ చేస్తున్న తప్పులను ఆరెస్సెస్‌ అంగీకరిస్తుందా? అని లేఖలో ప్రశ్నించారు. ఈ లేఖపై స్పందించిన బీజేపీ, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడికి లేఖ రాయడానికి బదులు ఆ సంస్థ నుంచి సేవా స్పూర్తిని నేర్చుకోవాలని కేజ్రీవాల్‌కు సూచించింది.

వివరాలు 

కేజ్రీవాల్‌ నూతన సంవత్సరంలో అబద్ధాలు చెప్పడం మానుకోవాలి 

బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది, ఆప్‌ గురించి విమర్శలు చేస్తూ, ఆమ్‌ఆద్మీపార్టీ దేశ రాజకీయాల్లో అవిశ్వసనీయ పార్టీగా మారిందని అన్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. మరోవైపు, దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ, కేజ్రీవాల్‌కు నూతన సంవత్సరంలో అబద్ధాలు చెప్పడం మానుకోవాలని కోరుతూ మరో లేఖ రాశారు.