NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Boat sinked in Mahanadi: ఒడిశాలో ఘోర ప్రమాదం..మహానదిలో పడవ మునిగి ఎనిమిదిమంది మృతి..
    తదుపరి వార్తా కథనం
    Boat sinked in Mahanadi: ఒడిశాలో ఘోర ప్రమాదం..మహానదిలో పడవ మునిగి ఎనిమిదిమంది మృతి..
    సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన ఓడీఆర్​ ఎఫ్​ బృందాలు

    Boat sinked in Mahanadi: ఒడిశాలో ఘోర ప్రమాదం..మహానదిలో పడవ మునిగి ఎనిమిదిమంది మృతి..

    వ్రాసిన వారు Stalin
    Apr 20, 2024
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశా (Odisha )లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

    జార్సుగూడ (Jharsuguda) జిల్లా బంధిపాలి (Bandhipali) ప్రాంతంలో మహానదిలో శుక్రవారం రాత్రి 50 మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది.

    ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.

    తక్షణ సమాచారం అందుకున్న సహాయక చర్యల బృందం రక్షణ చర్యలు ప్రారంభించింది.

    శనివారం ఉదయం నాటికి ఏడు మృతదేహాలను బయటకు తీశారు.

    మరొకరి మృత దేహం కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి.

    బార్ఘడ్ జిల్లా బంధిపల్లి ఏరియా నుంచి ప్రయాణికులతో బయల్దేరిన పడవ మధ్యలో వచ్చేసరికి నీరు చేరడంతో మునిగిపోయినట్లు తెలుస్తోంది.

    జార్సుగూడ లోని శారదా ఘాట్ వద్ద మరింత మందిని ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

    Boat Sinked in Odisha

    రంగంలోకి దిగిన ఓడీఆర్​ ఎఫ్​ బృందాలు

    సమాచారం అందుకున్న ఒడిశా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఓడీఆర్ ఎఫ్) (ODRF) సహాయ చర్యల కోసం రంగంలోకి దిగాయి.

    సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భువనేశ్వర్ (Bhuvaneswar) నుంచి క్యూబా డైవర్స్ ను కూడా తీసుకొచ్చినట్లు జిల్లా కలెక్టర్ (Collector) గోయల్ (Goyel) మీడియాకు వెల్లడించారు.

    ఇప్పటివరకు 48 మందిని కాపాడామని, వారిని క్షేమంగా ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

    కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారికి 4లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ముఖ్యమంత్రి (Chief Minister) నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ప్రకటించారు.

    Odisha - Boat sinked

    మృతులు ఛత్తీస్​ గఢ్​ లోని ఖర్సియా కు చెందిన వారిగా గుర్తింపు

    ఈ ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

    ఈ ప్రమాదంలో మరణించిన వారిని రాథికాబాయి రథియా, కేసరిబాయి రథియా, లక్ష్మీ రథియా, చిన్నారి నవీన్ రథియా, చిన్నారి కునాల్ రథియా గా పోలీసులు గుర్తించారు.

    వీరంతా ఛత్తీస్ గఢ్ లోని ఖర్సియా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారిగా తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    భువనేశ్వర్

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    ఒడిశా

    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    ఒడిశా: బార్‌గఢ్‌లో మరో రైలు ప్రమాదం  రైలు ప్రమాదం
    ఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు  రైలు ప్రమాదం
    ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు  రైలు ప్రమాదం

    భువనేశ్వర్

    టీమిండియాలో రీఎంట్రీ కోసం ఐపీఎల్‌లో విజృంభించనున్న భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్
    తొలి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ కెప్టెన్ మార్పు క్రికెట్
    అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన తెలంగాణ
    ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి  ఒడిశా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025