NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mumbai hoarding collapse: ముంబై హోర్డింగ్ కూలిన ఘటన.. కారులో మాజీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజర్, భార్య మృతదేహాలు 
    తదుపరి వార్తా కథనం
    Mumbai hoarding collapse: ముంబై హోర్డింగ్ కూలిన ఘటన.. కారులో మాజీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజర్, భార్య మృతదేహాలు 
    ముంబై హోర్డింగ్ కూలిన ఘటన.. కారులో మాజీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజర్, భార్య మృతదేహాలు

    Mumbai hoarding collapse: ముంబై హోర్డింగ్ కూలిన ఘటన.. కారులో మాజీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజర్, భార్య మృతదేహాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 16, 2024
    01:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఘాట్‌కోపర్‌ హోర్డింగ్‌ ఘటన జరిగి నేటికి నాలుగు రోజులైంది.ఈ దుర్ఘటనలో 16 మంది ముంబైవాసులు ప్రాణాలు కోల్పోయారు.

    ఈ దుర్ఘటనలో ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్(ATC)రిటైర్డ్ మేనేజర్ మనోజ్‌ చన్సోరియా(60),ఆయన భార్య(59)మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

    సోమవారం ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో భారీ హోర్డింగ్ ఒక పెట్రోల్‌ పంప్‌పై కుప్పకూలిన విషయం తెలిసిందే.

    ఈ హోర్డింగ్ కింద దాదాపు 100మంది చిక్కుకుపోయారు.వారిలో ఈ దంపతులు కూడా ఉన్నారు.

    "కుళ్లిపోయిన స్థితిలో" ఉన్న జంట మృతదేహాలను హోర్డింగ్ కింద ఇరుక్కున్న కారు నుండి వెలికి తీసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎమ్‌సి)అధికారి పిటిఐకి తెలిపారు.

    ముంబై ఏటీసీలో జనరల్‌ మేనేజర్‌ హోదాలో పనిచేసిన చన్సోరియా.. రెండు నెలల క్రితమే రిటైర్ అయ్యారు.

    Details 

    ముంబైని వీడి,జబల్‌పుర్‌కు షిఫ్ట్

    రిటైర్ అయ్యాక వారు ముంబైని వీడి,జబల్‌పుర్‌కు షిఫ్ట్ అయ్యారు. వీసా నిమిత్తం కొద్దిరోజుల క్రితం వారు ఇక్కడకు వచ్చారని బంధువులు తెలిపారు.

    పని పూర్తి చేసుకొని పశ్చిమ ముంబైలోని ఏటీసీ అతిథి గృహం నుంచి రెడ్ కలర్ కారులో దంపతులు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు బయలుదేరారు.

    జబల్‌పుర్‌ వెళుతున్నక్రమంలో..పెట్రోల్‌ ఫిల్‌ చేసుకునేందుకు బంక్‌ వద్ద కారు ఆపిన సమయంలోనే మృత్యువు వారిని కబళించింది.

    Details 

    ఫోన్‌ ఎత్తకపోవడంతో.. మిస్సింగ్ ఫిర్యాదు

    మనోజ్‌ చన్సోరియా కుమారుడు అమెరికాలో ఉంటున్నారు.

    గత రెండు రోజులుగా తల్లిదండ్రులు ఫోన్‌ ఎత్తకపోవడంతో ఆందోళనగురైన అయన ముంబైలో ఉంటున్న బంధువులను అప్రమత్తం చేయడంతో.. వారు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.

    ఈ క్రమంలోనే వారికి దుర్మరణం వార్త తెలిసింది.

    ఈ బిల్‌బోర్డ్‌ను ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్‌స్టాల్ చేసింది. ముంబై పోలీసులు ఈగో మీడియా యజమాని భవేష్ భిండేపై నేరపూరిత నరహత్య కింద కేసు నమోదు చేశారు.

    భిండేపై గతంలో 23 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అతనిపై ములుంద్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు కూడా నమోదైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై

    తాజా

    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్
    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్

    ముంబై

    Mumbai: ముంబైలో విషాదం.. సూట్‌కేస్ లో మహిళ మృతదేహం  భారతదేశం
    Anand Mahindra : అలా చూస్తే బాధ కలుగుతోంది.. ముంబై నగర పాలిక పై ఆనంద్ మహీంద్రా ఆనంద్ మహీంద్ర
    26/11 Mumbai attacks: ముంబై ఉగ్రదాడికి 15ఏళ్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    Mumbai: ముంబైలో అగ్నివీర్ ట్రైనీ ఆత్మహత్య  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025