NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేటి నుంచి తెలంగాణలో ఆషాఢ బోనాలు.. తొలి బోనం ఆ అమ్మవారికే
    తదుపరి వార్తా కథనం
    నేటి నుంచి తెలంగాణలో ఆషాఢ బోనాలు.. తొలి బోనం ఆ అమ్మవారికే
    నేటి నుంచి తెలంగాణలో ఆషాఢ బోనాలు.. తొలి బోనం ఆ అమ్మవారికే

    నేటి నుంచి తెలంగాణలో ఆషాఢ బోనాలు.. తొలి బోనం ఆ అమ్మవారికే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 22, 2023
    10:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆషాఢ మాసం వచ్చేసింది. తెలంగాణలో బోనాల పండగ సందడి మొదలైంది. నేటి నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి.గోల్కొండలో తొట్టెల ఊరేగింపుతో తొలి బోనాలు మొదలుకానున్నాయి.

    ఉత్సవాలతో దాదాపు నెల రోజులు హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాలు సందడిగా మారనున్నాయి. బోనాల పండుగకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. భక్తులకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది.

    మెహదీపట్నం పరిధిలోని లంగర్ హౌస్‌లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు పర్వం జరగనుంది.

    తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ బోనాల ఊరేగింపులో పాల్గొననున్నట్లు సమాచారం.

    ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆయా మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో తొలి బోనం గోల్కొండలోనే ప్రారంభమవుతాయి.

    DETAILS

    ఉత్సవాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది : మంత్రి తలసాని

    ఏటా ఆషాఢ మాసంలో బోనాల పండుగను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఎల్లమ్మను ప్రత్యేకంగా పూజిస్తారు. అనంతరం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తారు.

    మరోవైపు సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర జూలై 9న ప్రారంభం కానుంది. అయితే ఊరేగింపును జూలై 10న నిర్వహించనున్నారు.

    హైదరాబాద్ పాతబస్తీలో జూలై 16న బోనాల ఉత్సవం మొదలుకానుంది. జూలై 17న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు ఉత్సవాన్ని జరిపించనున్నారు.

    బోనాల ఉత్సవ నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

    బోనాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని మంత్రి తలసాని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా ఈ ఉత్సవాలను జరిపిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైదరాబాద్
    పండగలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తెలంగాణ

    తెలంగాణ: బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం రూల్స్ ఇవే..ఈనెల 20న దరఖాస్తుకు లాస్ట్ డేట్ ప్రభుత్వం
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం వర్షాకాలం
    దేశానికే హైదరాబాద్ హెల్త్ హబ్.. అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రికి భాగ్యనగరమే నిలయం హైదరాబాద్
    ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీడియో విడుదల.. జాతీయ మహిళా కమిషన్ లో శేజల్ ఫిర్యాదు  దిల్లీ

    హైదరాబాద్

    పౌష్టికాహార పంటల ఉత్పత్తిపై ఇక్రిసాట్‌ స్పెషల్ ఫోకస్ ఆహారం
    హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు  బస్
    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  ప్రకాశం జిల్లా
    హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ వీసాలు

    పండగలు

    మహాశివరాత్రి పండగ రోజు ఉపవాసం ఉన్నవారు తినగలిగే ఆహారాలు పండగ
    రంజాన్ 2023: విశేషాలు, ఆచారాలు, ఉపవాస నియమాలు పండగ
    హనుమాన్ జయంతి విశేషాలు: హనుమాన్ చాలీసా ఎవరు రాసారో తెలుసా? పండగ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025