NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: వేసవి ప్రారంభంలోనే వట్టిపోతున్న బోర్లు.. ఎండిపోతున్న పంటలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: వేసవి ప్రారంభంలోనే వట్టిపోతున్న బోర్లు.. ఎండిపోతున్న పంటలు
    వేసవి ప్రారంభంలోనే వట్టిపోతున్న బోర్లు.. ఎండిపోతున్న పంటలు

    Telangana: వేసవి ప్రారంభంలోనే వట్టిపోతున్న బోర్లు.. ఎండిపోతున్న పంటలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 11, 2025
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వేసవి కాలం ప్రారంభంలోనే భూగర్భ జలాలు క్షీణించడంతో నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి మండలాల్లో బోర్లు నీటిలేకుండా వాడిపోతున్నాయి.

    ఫలితంగా, యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి కొంతమంది రైతులు మరింత లోతైన బోర్లు తవ్విస్తున్నా, నీరు రాకపోవడంతో తీవ్రంగా అప్పుల పాలవుతున్నారు.

    పంట కోత దశకు చేరుకునే సమయంలో నీటి లేమి కారణంగా పంట పూర్తిగా ఎండిపోతుండటంతో, రైతులు తమ శ్రమ వృథా కావడంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    సిరికొండ మండలం గడ్కోల్‌కు చెందిన రైతు కొమ్మటి రాంబాయి తమకున్న రెండు ఎకరాల్లో వరి సాగు చేశారు.

    వివరాలు 

     తక్కువ నీరు రావడంతో.. 

    బోరు పూర్తిగా ఎండిపోవడంతో, మరోచోట రూ.3.40 లక్షల వ్యయంతో 600 అడుగుల లోతు బోరు తవ్వించారు.

    అయినప్పటికీ, తక్కువ నీరు రావడంతో ఒకే ఎకరానికి మాత్రమే సరిపోతోంది. మరో ఎకరానికి నీరు అందక, పంట పొలం ఎండిపోతుండటంపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

    ధర్పల్లి మండలం సీతాయిపేటకు చెందిన అన్నదమ్ములు సబావత్ దేవ్, సబావత్ బోయిలు కలిపి 7 ఎకరాల్లో వరి పండించారు.

    ఉన్న మూడు బోర్లు పూర్తిగా వాడిపోవడంతో, నీరందక పంట ఎండిపోయింది. దీనితో, పొలాన్ని మేకల మేపే ప్రదేశంగా మార్చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ.2 లక్షల ఖర్చయిందని వాపోయారు.

    వివరాలు 

    బావులు పూర్తిగా అడుగంటి..

    కరీంనగర్‌ గ్రామీణ మండలం మొగ్దుంపూర్‌లో, ఇరుకుల్ల వాగును ఆధారంగా చేసుకుని అంజయ్య అనే రైతు రెండు ఎకరాలు సాగు చేశారు.

    అయితే, మార్చి నెలలోనే తీవ్ర ఎండలు పట్టిపడటంతో వాగులు, బావులు పూర్తిగా అడుగంటి పోయాయి.

    ఫలితంగా, పంట కోత దశకు చేరుకునే సరికి ఒక్క చుక్క నీరు కూడా లేక పొలం పూర్తిగా ఎండిపోవడంతో, చేసేదేం లేక పొలంలోనే ఇలా కన్నీటిని దిగమింగుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Amritsar: 'భయపడాల్సిన అవసరం లేదు': అమృతసర్​ లో మళ్లీ మోగిన సైరన్.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు అమృత్‌సర్
    Operation Sindoor: భారత్,పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. చండీగఢ్‌లోని వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి బెదిరింపు,మ్రోగిన సైరన్  ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ గుజరాత్
    Exams: భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో .. నేటి నుంచి జరగాల్సిన పరీక్షలు రద్దు పరీక్షలు

    తెలంగాణ

    SLBC Tunnel Rescue: టన్నెల వద్ద ఉత్కంఠ భరిత క్షణాలు.. కీలక దశకు చేరుకున్న ఆపరేషన్! భారతదేశం
    Yadagirigutta Brahmotsavam 2025 : నేటి నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల శోభ.. వాహన సేవల సమయాలివే! యాదాద్రి
    SLBC Tunnel: 8 మంది సజీవంగా ఉండే అవకాశం లేనట్లే..! మార్క్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు వేగవంతం శ్రీశైలం
    Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. తొలి విడత ఆర్థిక సాయంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025