Rajasthan: లంచం ఆరోపణలపై ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్
నావల్ కిషోర్ మీనా అనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారిని రాజస్థాన్ అవినీతి నిరోధక విభాగం(ACB)గురువారం అరెస్టు చేసింది. అతను మధ్యవర్తి ద్వారా తన సహచరుడు బాబూలాల్ మీనాతో కలిసి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మణిపూర్కి చెందిన చిట్ఫండ్ కేసులో నావల్ కిషోర్ మీనా,బాబులాల్ మీనా లంచం తీసుకున్నట్లు ఫిర్యాదుదారు తెలిపారు. కేసును కొట్టివేయడం,అరెస్టు చేయకపోవడం,ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కోసం ఈడీ అధికారులు లంచం తీసుకుంటున్నారని రాజస్థాన్ ఏసీబీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. 17 లక్షల లంచం ఇవ్వాలని తొలుత డిమాండ్ చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించి రాజస్థాన్లోని పలు చోట్ల రాజస్థాన్ ఏసీబీ దాడులు నిర్వహించిన తర్వాత అరెస్ట్ చేశారు.నావల్ కిషోర్ మీనాను రాజస్థాన్ ఏసీబీ ట్రాప్ చేసింది.