Page Loader
British Woman: సోషల్‌ మీడియాలో పరిచయం.. స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన బ్రిటిష్ మహిళ 
సోషల్‌ మీడియాలో పరిచయం.. స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన బ్రిటిష్ మహిళ

British Woman: సోషల్‌ మీడియాలో పరిచయం.. స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన బ్రిటిష్ మహిళ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2025
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన స్నేహితుడి మాయమాటలను నమ్మి, అతడిని కలుసుకోవడానికి ఓ యువతి బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చింది. ఇక్కడికి వచ్చిన ఆమె అతడి చేతిలో ఘోరంగా మోసపోయింది. హోటల్ గదిలో ఆమె అత్యాచారానికి గురైంది. దిల్లీలోని మహిపాల్‌పుర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది అని పోలీసులు వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన మహిళకు సోషల్ మీడియాలో భారత్‌కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తరచూ వారిద్దరూ సంభాషించేవారు.ఆ పరిచయంతో అతడిని ప్రత్యక్షంగా కలుసుకోవాలని భావించి, ఆమె భారత్‌కు ప్రయాణించింది. మహిపాల్‌పుర్‌లో ఒక హోటల్ గదిని బుక్ చేసుకుంది.అనంతరం,ఆమెను కలుసుకోవడానికి ఆ వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు.

వివరాలు 

అత్యాచారం, లైంగిక వేధింపుల క్రింద  అరెస్టు

అయితే, అతడి ప్రవర్తన అభ్యంతరకరంగా ఉండటంతో ఆమె వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇది ఇద్దరి మధ్య తీవ్ర వాదనకు దారితీసింది. ఆ తర్వాత, ఆ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అతడి దుశ్చర్య నుంచి తప్పించుకొని రిసెప్షన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో, లిఫ్ట్‌లో ఆమెను అతడి స్నేహితుడు లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు, అత్యాచారం, లైంగిక వేధింపుల నేరాల కింద వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.