
Hyderabad: ఫ్లెక్సీల వివాదం.. బీఆర్ఎస్ కార్పొరేటర్పై దాడి.. !
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్లోని ఓ కాంగ్రెస్ నాయకుడి నివాసం వెలుపల ఉన్న ఫ్లెక్సీ బోర్డులను తొలగించే వివాదంతో హైదరాబాద్లోని స్థానిక భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కార్పొరేటర్ దేదీప్యారావుపై గుర్తు తెలియని మహిళలు దాడి చేశారు.
కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీ బోర్డులను తొలగించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న దేదీప్యారావు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డిఆర్ఎఫ్)ని ఆదేశించిన సంఘటన మంగళవారం రాత్రి హైదరాబాద్లోని వెంగల్ రావు నగర్ ప్రాంతంలో జరిగింది.
వెంటనే కాంగ్రెస్ నాయకుడి మద్దతుదారులు సంఘటనా స్థలానికి చేరుకుని దేదీప్యారావుతో వాగ్వాదానికి దిగారు.
కార్పొరేటర్కు మద్దతుగా ఉన్న వ్యక్తులు కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Details
దేదీప్యారావుపై భౌతికంగా దాడి
దేదీప్యారావు తన వాహనంలో ఎక్కుతుండగా పలువురు గుర్తు తెలియని మహిళలు దేదీప్యారావుపై భౌతికంగా దాడి చేశారు.
అయితే, స్వల్ప గాయాలతో బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు బయటపడ్డారు.
గొడవ జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.
"ఈ సంఘటన గత రాత్రి జరిగింది. కార్పొరేటర్పై దాడి చేసిన మహిళలపై మేము కేసు నమోదు చేసాము" అని జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్ మధుసూధన్ ఉటంకిస్తూ ANI న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఇకపోతే ఈ సంఘటనకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కార్పొరేటర్ పై దాడి చేస్తున్న మహిళలు
BRS Corporator Dedeepya Rao Attacked By Women In Jubilee Hills #PakkaTelugu #Telangana#BRS #BRSParty #jubileeHills #viralvideo #Dedeepya #HyderabadNews #Hyderabad pic.twitter.com/hL0eDDVLX4
— Pakka Telugu (@PakkaTelugu_com) March 13, 2024