NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీజేపీ,కాంగ్రెస్ దొందు దొందే.. అందుకే ఇండియా కూటమిలో చేరలేదన్న మాయావతి
    తదుపరి వార్తా కథనం
    బీజేపీ,కాంగ్రెస్ దొందు దొందే.. అందుకే ఇండియా కూటమిలో చేరలేదన్న మాయావతి

    బీజేపీ,కాంగ్రెస్ దొందు దొందే.. అందుకే ఇండియా కూటమిలో చేరలేదన్న మాయావతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 19, 2023
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయవతి కాంగ్రెస్, బీజేపీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రధాన జాతీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

    విప‌క్ష పార్టీలన్నీ కలిసి బెంగళూరు వేదికగా ఇటీవలే ఇండియాగా కూట‌మి కట్టిన సందర్భంగా మాయావ‌తి స్పందించారు. ఇటు కేంద్రంలోని బీజేపీ కానీ అటు విప‌క్షలు కానీ ప్రజా సంక్షేమం కోసం ప‌నిచేయ‌ట్లేదన్నారు.

    అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోందని ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావ‌తి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కుల‌త‌త్వ‌, పెట్టుబడిదారి పార్టీల‌తో హస్తం జ‌తక‌ట్టిందని ఎద్దేవా చేశారు.

    కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఆ పార్టీ వెంపర్లాడుతోందన్నారు.ఓ వైపు బీజేపీ ఎన్డీఏ బ‌లోపేతంపై దృష్టి సారించిందన్న మాయావతి, ఈ రెండు పార్టీలు ద‌ళిత‌, ముస్లిం వ్య‌తిరేకులేనన్నారు.

    DETAILS

    4 రాష్ట్రాల ఎన్నికల బరిలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది : మాయావతి

    ద‌ళితులు, ముస్లింలు, మైనార్టీల కోసం ఇప్పటి వరకు ఈ పార్టీలేమీ చేయ‌లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికార, విపక్ష పార్టీలన్నీ ఒక్క‌టేనని, తీరా గద్దెనెక్కాక ఇచ్చిన వాగ్ధానాల‌ను మర్చిపోతారని ఆమె చురకలు అంటించారు.

    మరోవైపు కాంగ్రెస్, బీజేపీ రెండింటి విధానాలు ఒక్క‌టేనన్నారు. ఈ నేపథ్యంలోనే విప‌క్ష పార్టీల‌తో తాము చేతులు క‌ల‌ప‌లేద‌ని మాయావ‌తి వెల్లడించారు.

    అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ సారూప్య భావాలు కలిగిన కుల, పెట్టుబడిదారీ పార్టీలతోనే పొత్తుకు ఒడిగడుతోందన్నారు.

    ఈ క్రమంలోనే వచ్చే నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల బరిలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కాంగ్రెస్, బీజేపీ విధానాలను తప్పుబట్టిన మాయావతి

    Uttar Pradesh: These parties don’t work for the welfare of the people. They have not done anything for Dalits, Muslims, and minorities. All are the same. When they come to power, they forget their promises. They have not fulfilled a single promise made to be the people. Be it… pic.twitter.com/BSGWdjEzLM

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 19, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బహుజన్ సమాజ్ పార్టీ/ బీఎస్పీ
    కాంగ్రెస్

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    బహుజన్ సమాజ్ పార్టీ/ బీఎస్పీ

    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఉత్తర్‌ప్రదేశ్
    యూసీసీకి వ్యతిరేకం కాదు, అలాగని మద్దతు కూడా ఇవ్వను: మాయావతి ఆసక్తికర కామెంట్స్  మాయావతి

    కాంగ్రెస్

    సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి భారతదేశం
    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    హస్తం గూటికే జూపల్లి, పొంగులేటి - నెలాఖరులోగా చేరికలకు ముహూర్తం తెలంగాణ
    కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025