NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP News: రాష్ట్రంలో అనధికార,అక్రమ నిర్మాణాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన పురపాలకశాఖ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP News: రాష్ట్రంలో అనధికార,అక్రమ నిర్మాణాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన పురపాలకశాఖ 

    AP News: రాష్ట్రంలో అనధికార,అక్రమ నిర్మాణాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన పురపాలకశాఖ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 27, 2025
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్'లో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి పురపాలకశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

    ఇటీవల సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఈ మార్గదర్శకాలను రూపొందించారు.

    ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

    వివరాలు 

    పురపాలకశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు: 

    ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొందడానికి భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలి.

    ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల్లో నివాసానికి అనుమతి ఇవ్వాలి.

    నిర్మాణం పూర్తయ్యే వరకు ప్లాన్‌ను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి.

    సంబంధిత అధికారులు సమయానుసారంగా బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాన్ని తనిఖీ చేయాలి.

    డీవియేషన్ (అనుమతించని మార్పులు) సరిచేసే వరకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వకూడదు.

    డీవియేషన్ ఉన్న భవనాలకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు.

    వివరాలు 

    పురపాలకశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు: 

    నివాసయోగ్య ధ్రువపత్రం జారీ అయిన తర్వాతే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు కల్పించాలి.

    అక్రమంగా నిర్మించిన భవనాలకు ట్రేడ్, బిజినెస్ లైసెన్స్‌లు మంజూరు చేయకూడదు.

    జోనల్ ప్లాన్ ప్రకారం అనుమతించని మార్పులు లేకుండా నిర్మాణాలు ఉండేలా చూడాలి.

    బ్యాంకులు రుణాలు మంజూరు చేసే ముందు నివాసయోగ్య ధ్రువపత్రం ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి.

    ఈ మార్గదర్శకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యేలా అధికారులందరూ కఠిన చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్
    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్

    ఆంధ్రప్రదేశ్

    AP Houses: ఇళ్లు, స్థలాలు రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వైసీపీ
    Andhra News: వేసవిలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌.. కొనుగోలు వ్యయం తగ్గించేందుకు స్వాపింగ్‌ విధానం భారతదేశం
    E - office: నెలాఖరుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థ  భారతదేశం
    APPSC: గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ విధానం, పరీక్షా వివరాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025