NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / RG Kar case: ఆర్జీకర్‌ కేసులో బెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన కలకత్తా హైకోర్టు 
    తదుపరి వార్తా కథనం
    RG Kar case: ఆర్జీకర్‌ కేసులో బెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన కలకత్తా హైకోర్టు 
    ఆర్జీకర్‌ కేసులో బెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన కలకత్తా హైకోర్టు

    RG Kar case: ఆర్జీకర్‌ కేసులో బెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన కలకత్తా హైకోర్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 07, 2025
    01:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతాలోని ఆర్జీకర్‌ వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ,పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసింది.

    అయితే హైకోర్టు ఈప్రత్యేక అప్పీల్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది.

    అదే సమయంలో,అదే తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI)దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయస్థానం అంగీకరించింది.

    ఇదే కేసులో,మృతురాలి తల్లిదండ్రులు కేసు పునర్విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు.

    అయితే,సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది.అయినప్పటికీ,మార్చి 17న ఈ విషయంపై విచారణ చేపడతామని వెల్లడించింది.

    గతేడాది ఆగస్టు 9న రాత్రి ఆర్జీకర్‌ ఆసుపత్రిలో ఓ మహిళా వైద్యురాలిపై హత్యాచారం జరగగా, సియాల్దా కోర్టు ఈ కేసులో నిందితుడు సంజయ్‌కు జీవితఖైదు విధించింది.

    వివరాలు 

    మమతా ప్రభుత్వ తీరుపై మృతురాలి తండ్రి అసంతృప్తి

    అంతేకాకుండా, బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    ఈ తీర్పుపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

    నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ, మమతా ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.

    అయితే, ఈ అప్పీల్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.

    ఈ కేసును విచారించిన సంస్థగా శిక్ష విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు తమకే ఉందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అనవసరమని పేర్కొంది.

    మమతా ప్రభుత్వ తీరుపై మృతురాలి తండ్రి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

    ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు అవసరం లేదని సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా

    తాజా

    Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ  గుజరాత్ టైటాన్స్
    Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం కల్వకుంట్ల కవిత
    PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ నరేంద్ర మోదీ

    కోల్‌కతా

    Kolkata rape-murder: దేశవ్యాప్తంగా శనివారం మరోసారి వైద్యుల సమ్మె.. IMA ప్రకటన భారతదేశం
    Kolkata Rape Case:కోల్‌కతా హత్యాచార కేసు.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    Harbhajan Singh: కోల్‌కతా ఘటనపై మమతా బెనర్జీకి హర్భజన్ సింగ్ లేఖ హర్బజన్ సింగ్
    Postmortem: ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం పూర్తి.. శరీరంపై 14కు పైగా గాయాలు అత్యాచారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025