NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Road Accidents: రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Road Accidents: రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం
    రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం

    Road Accidents: రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2025
    03:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర రహదారులు, రవాణాశాఖ సోమవారం రాత్రి ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

    ఈ పథకం సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది.

    గత జనవరిలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో, రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తులకు గోల్డెన్‌ అవర్‌ సమయంలో తక్షణంగా ఉచిత వైద్యం అందించాలన్న సూచనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

    ఈ పథకానికి 'క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ స్కీం-2025' అనే పేరు పెట్టింది.

    వివరాలు 

    ప్రమాదం జరిగే తేదీ నుండి ఏడవ రోజు వరకు చికిత్స

    దేశంలోని ఏ రహదారిపై అయినా మోటారు వాహనాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ఈ పథకం కింద నగదు చెల్లించకుండా (క్యాష్‌లెస్‌) రూ.1.5 లక్షల వరకు వైద్య చికిత్స పొందవచ్చు.

    ప్రమాదం జరిగే తేదీ నుండి ఏడవ రోజు వరకు ఈ చికిత్స సేవలు వర్తిస్తాయి.

    ట్రామా లేదా పాలీట్రామా చికిత్స అందించగల సామర్థ్యం కలిగిన ఆసుపత్రులన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఈ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

    వివరాలు 

    ఆసుపత్రి అందించిన సేవల ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి 

    రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే వైద్య చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.

    సంబంధిత ఆసుపత్రిలో తగిన సదుపాయాలు లేకపోతే, బాధితుడిని తక్షణమే మరో ఆసుపత్రికి తరలించాలి.

    ఈ రవాణా ఏర్పాట్ల బాధ్యత కూడా ఆసుపత్రిదే కావాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

    చివరగా, బాధితుడు డిశ్చార్జ్ అయిన తర్వాత చికిత్స చేసిన ఆసుపత్రి, అందించిన సేవలకు సంబంధించిన బిల్లును నిర్ణీత ప్యాకేజీ ప్రకారం ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    కేంద్ర ప్రభుత్వం

    8th Pay Commission : 8వ వేతన సంఘం అప్‌డేట్..50 లక్షల మంది ఉద్యోగులకు లాభం ఇండియా
    Waqf bill: రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు రాజ్యసభ
    Sheeshmahal: ఢిల్లీ 'శీష్ మహల్‌'పై విచారణకు ఆదేశించిన కేంద్రం దిల్లీ
    Horticulture: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025