తదుపరి వార్తా కథనం

Andhra Pradesh: ఏపీ రైతుల కోసం 25,894 టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 12, 2025
02:48 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలోని రైతుల అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి 25,894 టన్నుల యూరియా ఎరువు కేటాయించిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ యూరియా సరఫరా ఈ నెల 15వ తేదీ నుండి 22వ తేదీ మధ్య కాలంలో విశాఖపట్నం పోర్టుకు చేరనుందని గురువారం రాత్రి విడుదలైన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ ఫలితంగానే యూరియా రాష్ట్రానికి వస్తోందని వివరించారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాష్ట్రానికి 24,894 మెట్రిక్ టన్నుల యూరియా
రాష్ట్రానికి 24,894 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిన కేంద్రం
— Kinjarapu Atchannaidu (@katchannaidu) September 12, 2025
సీఎం @ncbn గారి చొరవ ఫలితమే ఈ కేటాయింపు
ఈనెల 15 తేదీ నుండి 22వ తేదీ లోపు విశాఖపట్నం పోర్టుకు యూరియా చేరుకోనుంది
రైతు అవసరాలకే ప్రధానం ఇస్తున్న కూటమి ప్రభుత్వం
వైసీపీ హయాంలో ఎరువుల కొరత రైతుల ఆందోళనలు
రైతు… pic.twitter.com/GX6yo0wJN8