NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Horticulture: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం
    తదుపరి వార్తా కథనం
    Horticulture: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం
    ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం

    Horticulture: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 18, 2025
    12:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం అందించాలని నిర్ణయించింది.

    ఈ నిర్ణయం మేరకు రెండు ప్రధాన పథకాల కింద నిధులను విడుదల చేయనుంది.

    సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమం (మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్- ఎంఐడీహెచ్) కింద రాష్ట్రానికి రూ.145 కోట్ల కేటాయించబడింది.

    అదనంగా, మెట్రో అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ పథకానికి హైదరాబాద్‌ను ఎంపిక చేయడం ద్వారా రాష్ట్రానికి త్వరలో రూ.333 కోట్లు అందించబడనున్నాయి.

    దేశంలో కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఎంఐడీహెచ్ పథకాన్ని అమలు చేస్తోంది.

    వివరాలు 

    2025-26 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక విడుదల 

    2025-26 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను తాజాగా విడుదల చేసింది.

    దీని ముందు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కోరగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించడంతో కేంద్రం 2025-26 సంవత్సరానికి రూ.145 కోట్లు కేటాయించింది.

    ఇది గతంలో ఇచ్చిన రూ.60 కోట్ల కంటే రూ.85 కోట్లు అధికం. ఈ మొత్తంలో 60% నిధులను కేంద్రం, 40% నిధులను రాష్ట్రం భరిస్తుంది.

    2025-26 కార్యాచరణ ప్రణాళిక కింద తెలంగాణలో ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది.

    ఇందులో కూరగాయలు 5,000 ఎకరాలు, మామిడి 2,000 ఎకరాలు, నారింజ 1,000 ఎకరాలు, కోకో 2,500 ఎకరాలు పెంచాలని నిర్ణయించారు.

    దీని కోసం అధికారులు రాయితీలు, ప్రోత్సాహకాలను పెంచారు.

    వివరాలు 

    మామిడి సాగుకు రూ.2 లక్షల  సాయం 

    గతంలో మామిడి సాగుకు మూడేళ్లలో ఎకరానికి రూ.81,581 సాయం అందేది, ఇప్పుడు దాన్ని రూ.2 లక్షలకు పెంచారు.

    నారింజ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి వంటి పంటల సాగుకు కూడా సాయం అందించనున్నారు.

    రక్షిత సాగు, అంకురోత్పత్తి, తెగుళ్ల నియంత్రణ, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్‌లకు సాయం అందించబడుతుంది.

    వ్యవసాయ యాంత్రీకరణ కింద చిన్న ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు, హ్యాండ్ స్ప్రేయర్లు వంటి పరికరాలను సమకూర్చనున్నారు. సౌర కంచెల ఏర్పాటుకు రుణమిస్తారు.

    వివరాలు 

    జీహెచ్‌ఎంసీ పరిధిలో కూరగాయల సాగును పెంచాలని నిర్ణయం 

    మరిన్ని పథకాల అమలు కింద, మెట్రో నగరాల్లో కూరగాయల కొరతను తీర్చేందుకు కేంద్రం రూ.2,000 కోట్లతో కూరగాయల సమూహాల పథకం ప్రారంభించింది.

    దీనిలో భాగంగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో కూరగాయల సాగును పెంచాలని నిర్ణయించారు.

    వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ వంటి జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనున్నారు.

    ఈ పథకం కింద కూరగాయల సాగుకు రైతులు, రైతు సమూహాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించి, అవసరమైన విత్తనాలు, మొక్కలు, సేంద్రియ ఎరువులు అందిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌    కేంద్ర ప్రభుత్వం
    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు

    తెలంగాణ

    Rythu bharosa: సీఎం ఆదేశాలతో.. 17 లక్షల మంది ఖాతాల్లో రైతుభరోసా జమ భారతదేశం
    Road Transport and Highways: తెలంగాణకు జాతీయ రోడ్డు రవాణా శాఖ 176.5 కోట్లు విడుదల భారతదేశం
    Telangana: తెలంగాణలో పీఈ సెట్‌, ఎడ్‌ సెట్‌ షెడ్యూల్‌ విడుదల.. మార్చి 12న పీఈ సెట్‌ నోటిఫికేషన్‌ను జారీ భారతదేశం
    Hyderabad: హైదరాబాద్‌-విజయవాడ రూ.99కే.. ఫ్లిక్స్‌ బస్సులో లాంచింగ్ ఆఫర్ భారతదేశం

    కేంద్ర ప్రభుత్వం

    BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు! కేరళ
    Farmers: రైతులకు ఆధార్‌ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు తెలంగాణ
    Jamili elections: జమిలి ఎన్నికల బిల్లుల గురించి కేంద్రం పునరాలోచన! జమిలి ఎన్నికలు
    RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం పనులకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్? నితిన్ గడ్కరీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025