NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు.. కచ్చితంగా పాటించాల్సిందే 
    తదుపరి వార్తా కథనం
    Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు.. కచ్చితంగా పాటించాల్సిందే 
    ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు.. కచ్చితంగా పాటించాల్సిందే

    Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు.. కచ్చితంగా పాటించాల్సిందే 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 26, 2025
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం పూర్తిచేసింది.

    మొదటి విడతలో, ఇంటి స్థలం ఉన్నవారికి, ఇల్లు నిర్మించుకునే అవకాశం కలిగినవారికి ప్రాధాన్యత ఇచ్చింది.

    ప్రతి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం అందిస్తున్న ప్రభుత్వం, ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా మంజూరు చేయనుంది.

    ఇదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను సూచించింది.

    వివరాలు 

    ప్రతి ఇంటిపైనా మూడు రంగుల గుర్తు

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సమయంలో మూడు రంగుల గుర్తింపుపై పెద్దగా దృష్టి పెట్టలేదు.

    కొన్నింటికి మాత్రమే మూడు రంగుల గుర్తులు అమలు చేయగా, మరికొన్నింటిలో అది లేదు.

    కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ప్రతి ఇంటిపైనా మూడు రంగుల గుర్తును తప్పనిసరిగా ఉంచాలని నిర్ణయించింది.

    ఇంటి యాజమానుల అభిప్రాయానికి సంబంధం లేకుండా, అన్ని ఇళ్లపై ఈ గుర్తులు ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

    వివరాలు 

    బండి సంజయ్ విమర్శలు

    కాంగ్రెస్ ప్రభుత్వ ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.

    ప్రధాని ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్లకు 'ఇందిరమ్మ' పేరు పెడితే, కేంద్రం నుండి ఒక్క పైసా కూడా రాదని హెచ్చరించారు.

    మోదీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెట్టడం సమంజసం కాదని ప్రశ్నించారు.

    ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం.

    ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులతో నిర్మించిన ప్రతి ఇంటిపై ఆ పథకం అధికారిక లోగో తప్పకుండా ఉండాలని కేంద్రం ఆదేశించింది.

    కేంద్రం ఎన్ని ఇళ్లకు నిధులు అందిస్తుందో, అన్ని ఇళ్లపై ఈ గుర్తు ఉండాలని స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్
    Shashi Tharoor: ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తే పాక్‌లో ప్రమోషన్లు.. ఆగ్రహించిన శశిథరూర్ కాంగ్రెస్
    Simple Energy: సింగిల్ ఛార్జ్‌తో 181 కి.మీ.. సింపుల్ వన్‌ఎస్‌ ఈ-స్కూటర్‌ స్పెషల్‌ ఫీచర్లు ఇవే! ఎలక్ట్రిక్ వాహనాలు
    ENG vs IND: ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి భారత్ సిద్ధం.. రోహిత్, కోహ్లీ లేకపోవడం శోచనీయం : వోక్స్  ఇంగ్లండ్

    తెలంగాణ

    Ramzan: తెలంగాణలో ముస్లిం ఉద్యోగుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం రంజాన్
    Guillain Barre Syndrome: జీబీ సిండ్రోమ్‌.. ఇంజక్షన్‌ ధర రూ.20వేలు ఆంధ్రప్రదేశ్
    Telangana: ప్రణాళికా శాఖ గణాంకాల సంకలనం విడుదల.. రంగారెడ్డి జిల్లా అగ్రస్థానం  భారతదేశం
    Sand Door Delivery: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇసుక డోర్ డెలివరీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025