Page Loader
KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 
కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వర్షంలో రోడ్డుపైనే బైఠాయింపు

KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 20, 2023
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. ఈ మేరకు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్‌రెడ్డి భారీ వర్షంలోనే బైఠాయించారు. బాటసింగారంలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పరిశీలించాలని భాజపా నిర్ణయించింది. ఈ క్రమంలో కిషన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే రఘునందన్‌ శంషాబాద్‌ నుంచి బయలుదేరారు. దీనికి అనుమతి లేదన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి వర్షంలో తడుస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టకూడదని రాచకొండ సీపీ చౌహాన్‌ అన్నారు. అయితే అనుమతుల్లేకుండా భారాస నేతలు రోడ్లపై ధర్నాలు ఎలా చేస్తున్నారని రఘునందన్‌ ప్రశ్నించారు. అనంతరం ఇరువురి నేతలను అదుపులోకి తీసుకుని నాంపల్లి బీజేపీ ఆఫీసుకు తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వర్షంలో కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన కిషన్ రెడ్డి