NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి
    తదుపరి వార్తా కథనం
    కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి
    దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా

    కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 05, 2023
    04:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గత కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

    కమల దళంలోని రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఈ మేరకు ప్రజలు సైతం ఏం జరగనుందోనని ఆసక్తి కనబరుస్తున్నారు.

    మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ప్రకటించాక, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తొలిసారి స్పందించారు. ఈ మేరకు దిల్లీలో మీడియాతో మాట్లాడారు.

    తాను పార్టీకి విధేయుడినని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని వెల్లడించారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు ముందుకు సాగుతానని చెప్పారు.

    జులై 8న వరంగల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ తర్వాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. కేంద్ర మంత్రి స్థానానికి సంబంధించి పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానికి కట్టుబడి ఉంటానన్నారు.

    DETAILS

    మోదీ సభ కోసం జులై 8 వరకు వరంగల్ లోనే కిషన్ రెడ్డి మకాం

    మరోవైపు ఇటీవలే జరిగిన కేంద్ర కేబినేట్ భేటీకి సైతం కిషన్‌ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు దిల్లీలోని తన నివాసంలోనే ఉండిపోవడం గమనార్హం.

    ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం ఆయన దిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరనున్నారు.

    ఈ క్రమంలోనే అందుబాటులో ఉన్న పార్టీ కీలక నేతలు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు సహా ఇతర ముఖ్య నేతలతో అత్యవసరగా భేటీ కానున్నారు. సమావేశంలో ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన ఏర్పాట్లపై చర్చించనున్నట్లు సమాచారం.

    ఈ మేరకు గురువారం ఉదయం కిషన్ రెడ్డి వరంగల్‌ లో పర్యటించనున్నారు. అనంతరం రెండు రోజుల పాటు అంటే జులై 8 వరకు వరంగల్‌లోనే ఉండనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కిషన్ రెడ్డి
    బీజేపీ
    నరేంద్ర మోదీ
    వరంగల్ తూర్పు

    తాజా

    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్

    కిషన్ రెడ్డి

    హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం  ద్రౌపది ముర్ము
    తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ బీజేపీ

    బీజేపీ

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా? కర్ణాటక
    కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి కర్ణాటక
    అనారోగ్యంతో బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత హర్యానా
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ కాంగ్రెస్

    నరేంద్ర మోదీ

    ఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే  ప్రధాన మంత్రి
    International Yoga Day 2023: 'యోగా డే'ను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసా?  యోగ
    త్వరలోనే టెస్లా యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తాం: మస్క్  ప్రధాన మంత్రి
    త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    వరంగల్ తూర్పు

    రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ తెలంగాణ
    10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్ బండి సంజయ్
    తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన తెలంగాణ
    ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్ ఇదే  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025