NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన
    తదుపరి వార్తా కథనం
    నేటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన
    వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన

    నేటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 31, 2023
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందాలు రానున్నాయి. ఈ మేరకు నేటి నుంచి ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. గత కొద్ది రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

    నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో కుంభవృష్టి కురిసింది. దీంతో రాజధాని హైదరాబాద్ మహానగరంతో పాటు జిల్లాల్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి.

    ప్రాజెక్టుల్లోకి భారీగా నీటి ప్రవాహం రావడంతో ఎక్కడికక్కడ గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివాసమున్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

    ఈ నేపథ్యంలో సోమవారం నుంచి కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుంది. వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసేందుకు ఇప్పటికే సమాయత్తమైంది.

    DETAILS

    వరదల అంచనాపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కమిటీ

    ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో చోటు చేసుకున్న నష్టాన్ని అంచనా వేయనున్నారు.దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు కురిసిన భారీ వానలతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. మరోవైపు వానలతో వేల ఎకరాల్లో పంట తుడిచిపెట్టుకుపోయింది.

    రోడ్లు, జాతీయ రహదారులు సైతం ధ్వంసమయ్యాయి. మరి కొన్ని చోట్ల వంతెనలు సైతం కూలిపోయాయి. ఈ మేరకే వరద నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు వివిధ శాఖల అధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కమిటీని నియమించింది.

    రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికకు అదనంగా కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం సైతం వరదలపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగానే కేంద్రం రాష్ట్రానికి సహాయ నిధులను కేటాయిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు

    తెలంగాణ

    Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్  హైదరాబాద్
    TS Govt : వైద్యారోగ్య శాఖలో పదోన్నతులు.. వారంలోగా పూర్తి చేయాలని ఆదేశాలు ప్రపంచం
    తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు హైదరాబాద్
    శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్‌ రావు కన్నుమూత.. విజయవాడలో అంత్యక్రియలకు ఏర్పాట్లు హైదరాబాద్

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం నరేంద్ర మోదీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025