Page Loader
Chandra Babu : ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

Chandra Babu : ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2024
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనాభా వృద్ధి పెంపు కోసం కుటుంబాల్లో కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలను కోరారు. అందుకు అనుగుణంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారే అర్హులయ్యేలా చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ ఆలోచనలో ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి రేటు పెరగాలని, అందరూ దీనిపై ఆలోచించాలన్నారు. కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా కుటుంబాలు ప్రణాళికలు వేసుకోవాలన్నారు.

Details

ఎక్కువ మంది పిల్లలున్న వారికి అవకాశం

గతంలో తాను జనాభా నియంత్రణ కోసం సమర్థించానని, కానీ భవిష్యత్తు కోసం జనాభా పెరుగుదల అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే అర్హత కల్పించేలా చట్టం తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇలాంటి కుటుంబ ప్రణాళికా విధానాల్లో మార్పులకు పిలుపునిచ్చారు. అప్పట్లో ఎక్కువ మంది పిల్లలను కలిగిన దంపతులకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు దేశంలో జనాభా నియంత్రణలో కీలక పాత్ర పోషించాయి.

Details

చంద్రబాబు ప్రకటనను సమర్థించిన బీజేపీ నేత

అయితే, 2026 తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల పునర్నిర్ణయం జరిగే సమయంలో ఈ రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయంగా ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు కూడా స్పందించాయి. చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే, ఇది మంచి మార్పు దిశగా తీసుకునే చర్య అని తాను నమ్ముతున్నానని బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ వ్యాఖ్యానించారు.