NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandra Babu : ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    Chandra Babu : ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
    ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

    Chandra Babu : ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 21, 2024
    02:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనాభా వృద్ధి పెంపు కోసం కుటుంబాల్లో కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలను కోరారు.

    అందుకు అనుగుణంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారే అర్హులయ్యేలా చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ ఆలోచనలో ఉందని చెప్పారు.

    రాష్ట్ర అభివృద్ధి రేటు పెరగాలని, అందరూ దీనిపై ఆలోచించాలన్నారు.

    కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా కుటుంబాలు ప్రణాళికలు వేసుకోవాలన్నారు.

    Details

    ఎక్కువ మంది పిల్లలున్న వారికి అవకాశం

    గతంలో తాను జనాభా నియంత్రణ కోసం సమర్థించానని, కానీ భవిష్యత్తు కోసం జనాభా పెరుగుదల అవసరమని పేర్కొన్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే అర్హత కల్పించేలా చట్టం తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

    గతంలో కూడా చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇలాంటి కుటుంబ ప్రణాళికా విధానాల్లో మార్పులకు పిలుపునిచ్చారు.

    అప్పట్లో ఎక్కువ మంది పిల్లలను కలిగిన దంపతులకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించారు.

    దక్షిణ భారత రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు దేశంలో జనాభా నియంత్రణలో కీలక పాత్ర పోషించాయి.

    Details

    చంద్రబాబు ప్రకటనను సమర్థించిన బీజేపీ నేత

    అయితే, 2026 తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల పునర్నిర్ణయం జరిగే సమయంలో ఈ రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

    రాజకీయంగా ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు కూడా స్పందించాయి.

    చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే, ఇది మంచి మార్పు దిశగా తీసుకునే చర్య అని తాను నమ్ముతున్నానని బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ వ్యాఖ్యానించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    చంద్రబాబు నాయుడు

    Ramcharan: నేడు సీఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌నున్న ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ రామ్ చరణ్
    Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. . వరద బాధితులకు ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్
    Free Gas Cylinder: ఎన్నికల హామీపై సీఎం కీలక ప్రకటన.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ భారతదేశం
    AP Flood Relief Fund: ఆంధ్రలో వరదలు.. గౌతమ్ ఆదానీ 25కోట్ల రూపాయల భారీ విరాళం అదానీ గ్రూప్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: డ్వాక్రా సంఘాల మహిళలకు సూపర్ స్కీమ్.. ఏపీ ప్రభుత్వం నుంచి 'స్ఫూర్తి'  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Pawan Kalyan: ఉద్యోగ భద్రత కోసం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీఆర్‌డబ్ల్యూఎస్‌ ల్యాబ్‌ ఉద్యోగులు పవన్ కళ్యాణ్
    Amarawati: అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి వేగంగా అడుగులు.. క్షేత్రస్థాయిలో మరోసారి ఎలైన్‌మెంట్‌ పరిశీలన చంద్రబాబు నాయుడు
    AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు.. ఆ రెండు జిల్లాలు రద్దు.. ప్రభుత్వం ఏమి చెప్పిందంటే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025