NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్
    తదుపరి వార్తా కథనం
    Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్
    చంద్రబాబు కీలక నిర్ణయం.. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్

    Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 24, 2024
    09:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతిలోని సచివాలయంలో చేనేత, హస్తకళల రంగంపై సమీక్ష నిర్వహించారు.

    ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, పవర్‌లూమ్ కార్మికులు, హస్తకళాకారుల సంఖ్యపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

    త్వరలోనే నూతన టెక్స్‌టైల్స్ పాలసీని తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం కింద చేనేత మగ్గాలున్న వారికి 200 యూనిట్లు, మర మగ్గాలున్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.

    Details

    త్వరలో ఆరోగ్య భీమా

    చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని త్వరలో అమలులోకి తెచ్చి, త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు.

    ఆప్కోలో సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అలాగే బకాయిల విడుదలకు కూడా ఆమోదం తెలిపారు.

    ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక హామీ ఇచ్చారు కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులకు రీయింబర్స్ చేస్తుందని తెలిపారు.

    చేనేత ఉత్పత్తుల ఆధునికీకరణ ద్వారా వాటికి డిమాండ్ పెంచే అవకాశం ఉందని, ఈ-కామర్స్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు అధికారులకు సూచనలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: నేడు తిరుపతి.. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన భారతదేశం
    Chandrababu: శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు నెల్లూరు నగరం
    Somasila dam: నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి: సీఎం  భారతదేశం
    Chandrababu: కొత్త ఇంధన విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష భారతదేశం

    ఆంధ్రప్రదేశ్

    Flood Ration: ఇంటింటికి వరద సాయం పంపిణీ ప్రారంభం.. రేషన్ కార్డు లేనివారు ఇలా తీసుకోవచ్చు  భారతదేశం
    AP Rains: అలర్ట్.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు వాతావరణ శాఖ
    Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి  ప్రకాశం జిల్లా
    Vijayawada: చీకటిపడేలోగా వారంతా పునరావాస కేంద్రాల్లో ఉండకపోతే ప్రమాదమే : కలెక్టర్ విజయవాడ వెస్ట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025