ఛత్తీస్గఢ్ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత
ఛత్తీస్గఢ్లో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత లీలారామ్ భోజ్వానీ కన్నుమూశారు. రాయ్పూర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని గురువారం పార్టీ ప్రకటించింది. 82 ఏళ్ల వయసున్న ఈ కురువృద్ధుడు ఉమ్మడి మధ్యప్రదేశ్లోనే కీలక నాయకుడిగా పేరు గడించారు. ఈ మేరకు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్, మాజీ సీఎం రమణ్ సింగ్ భోజ్వానీ ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించన్నామని, ఈ క్రమంలోనే భౌతికకాయాన్ని రాజ్నంద్గావ్కు తరలించామని పేర్కొంది. అంతిమయాత్ర మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన నివాసం నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. 1990, 1998లో రాజ్నంద్గావ్ అసెంబ్లీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1990లో మధ్యప్రదేశ్ కార్మిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.