Indigo: ఇండిగో విమానానికి రెండో సారి బాంబు బెదిరింపు.. హై అలర్ట్
చెన్నై నుండి ముంబైకి వస్తున్న ఇండిగో 6E 5314 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ముంబైలో దిగిన తర్వాత ప్రయాణీకులను దించేశారు. ఆ తర్వాత సిబ్బంది ప్రోటోకాల్, భద్రతా ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. లావెట్రీలో బాంబు వుంది. మరో అరగంటలో పేలుతుందని కాల్ వచ్చింది. దీంతో ముంబై విమానాశ్రయంలో అత్యవసర భద్రతను ముమ్మరం చేశారు.
వారం రోజుల వ్యవధిలో ఇది రెండ సారి
వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. అంతకుముందు మే 28న ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే విమానంలో విమానానికి ఇలాంటి ముప్పు వచ్చింది. గత వారం ఇదే తరహాలో ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు నేపథ్యంలో, విమానంలోని ప్రయాణికులను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ద్వారం ద్వారా తరలించారు.