
Video: చైనా సైనికులను ఎదురుకొన్న లడఖ్ గొర్రెల కాపరులు
ఈ వార్తాకథనం ఏంటి
లడఖ్లోని గొర్రెల కాపరుల బృందం భారత్-చైనా సరిహద్దు సమీపంలో గొర్రెలను మేపుతున్న స్థానికులను ఆపడానికి ప్రయత్నించినప్పుడు చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత ఈ ప్రాంతంలో జంతువులను మేపడం మానేసిన గొర్రెల కాపరులు ఇప్పుడు ఆ ప్రాంతానికి తిరిగి వచ్చారు.
కానీ,చైనా సైన్యం వారిని అడ్డుకుంది.అవాక్కయిన స్థానికులు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సభ్యులను ప్రశ్నించారు.
మన సైన్యం సాయంతో అక్కడి నుంచి చైనా సేనలను వెనక్కి పంపించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియోను చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ తన X ఖాతలో షేర్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే
It is heartening to see the positive impact made by @firefurycorps_IA
— Konchok Stanzin (@kstanzinladakh) January 30, 2024
in Border areas of Eastern Ladakh in facilitating the graziers & nomads to assert their rights in traditional grazing grounds along the north bank of Pangong.
I would like to thank #IndianArmy for such strong… pic.twitter.com/yNIBatPRKE