NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'సుస్వాగతం'తో సుప్రీంకోర్టులోకి ప్రవేశం.. ఈ-పాస్‌ జారీ కోసం నూతన వ్యవస్థ ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    'సుస్వాగతం'తో సుప్రీంకోర్టులోకి ప్రవేశం.. ఈ-పాస్‌ జారీ కోసం నూతన వ్యవస్థ ప్రారంభం
    'సుస్వాగతం'తో సుప్రీంకోర్టులోకి ప్రవేశం

    'సుస్వాగతం'తో సుప్రీంకోర్టులోకి ప్రవేశం.. ఈ-పాస్‌ జారీ కోసం నూతన వ్యవస్థ ప్రారంభం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 10, 2023
    05:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సుప్రీంకోర్టులో కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. సులువుగా ఈ-పాస్‌లు పొందేందుకు కొత్త పోర్టల్‌ ప్రారంభమైంది.

    ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి వచ్చే పిటిషనర్లు, న్యాయవాదులు, సందర్శకులు సులువుగా పాస్‌లు అందిపుచ్చుకోవచ్చు.

    ఇందుకోసం సుస్వాగతం అనే కొత్త పోర్టల్‌ను గురువారం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ ప్రారంభించారు.

    జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అంతకుముందే సుస్వాగతం పోర్టల్‌ ఆవిర్భావాన్ని సీజేఐ ప్రకటించేశారు.

    పాస్‌ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన పని లేదని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. ఇకపై అన్ని రకాల పాస్‌లు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయన్నారు.

    DETAILS

    పోర్టల్ ఉపయోగించే విధానం తెలుసుకునేందుకు వీడియో అందుబాటులో ఉంచాం : సీజేఐ 

    సుస్వాగతం పోర్టల్ ను ఉపయోగించే విధానాన్ని వివరించేందుకు అందులోనే ఓ వీడియోను అందుబాటులో ఉంచినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు.

    సుస్వాగతం పోర్టల్ వెబ్‌, మొబైల్‌ ఆధారంగా నిర్వహించుకోవచ్చు. తమ వివరాలను ఇందులో నమోదు చేసి ఈ-పాస్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

    జులై 25, 2023 నుంచి పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఈ పోర్టల్‌ను పరీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోర్టల్ పనితీరుపై వినియోగదారులు సానుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు.

    పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 10 వేలకుపైగా ఈ-పాస్‌లను జారీ చేశామని, గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.

    DETAILS

    యూజర్‌ ప్రెండ్లీగా మార్చేందుకే పోర్టల్ రూపకల్పన

    ఉదయం వేళల్లో కోర్టులోకి వచ్చేందుకు కావాల్సిన పాస్‌లు పొందాలంటే సుప్రీంకోర్టు కౌంటర్‌ ముందు భారీ క్యూ ఉండేదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. ఇకపై అలాంటి క్యూ పరిస్థితులు ఉండవని హర్షం వ్యక్తం చేశారు.

    సుస్వాగతం పోర్టల్‌ ద్వారా వినియోగదారుల అవసరాల మేరకు ఈ-పాస్‌లను పొందొచ్చు. వివరాలను నమోదు చేసే క్రమంలో యూజర్లు తగిన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.అంతేకాకుండా లైవ్‌ ఫొటోను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

    ఈమెయిల్‌ లేదా పోర్టల్‌ ద్వారా పొందిన ఈ-పాస్‌పై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దాన్ని స్కాన్‌ చేసి కోర్టు లోపలికి, బయటికి వెళ్లేందుకు అనువుగా తీర్చిదిద్దారు.

    సుప్రీంలో కోర్టు సేవలను యూజర్‌ ప్రెండ్లీగా మార్చేందుకే సీజేఐ పోర్టల్ రూపకల్పన చేయించినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డివై చంద్రచూడ్
    సుప్రీంకోర్టు
    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    తాజా

    Vaibhav vs Dhoni: ఒకరు ఫినిషింగ్ మాస్టర్, మరొకరు ఓపెనింగ్ స్పెషలిస్ట్.. ఎవరిది పైచేయి? రాజస్థాన్ రాయల్స్
    Jyoti Malhotra Case: యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం  జ్యోతి మల్హోత్రా
    Landslides: విరిగిన కొండచరియలు.. కైలాస్ యాత్రలో చిక్కుకున్న వందలాది యాత్రికలు  కొండచరియలు
    Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..  జ్యోతి మల్హోత్రా

    డివై చంద్రచూడ్

    మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ సుప్రీంకోర్టు
    శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు శివసేన
    స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    సుప్రీంకోర్టు

    దిల్లీలో బైక్ ట్యాక్సీలకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు  దిల్లీ
    వివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    వైఎస్ వివేక హత్య కేసులో స్వయంగా వాదనలు వినిపించిన సునీతారెడ్డి.. ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి  ఆంధ్రప్రదేశ్

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు; ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ సుప్రీంకోర్టు
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    'హిందుత్వం అంటే జీవన విధానం'; చారిత్రక స్థలాల పేర్లను మార్చాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025