LOADING...
J&K: జమ్ముకశ్మీర్‌లో కుప్వారాలో మేఘ విస్ఫోటం.. ముంచెత్తిన ఆకస్మిక వరదలు 
జమ్ముకశ్మీర్‌లో కుప్వారాలో మేఘ విస్ఫోటం.. ముంచెత్తిన ఆకస్మిక వరదలు

J&K: జమ్ముకశ్మీర్‌లో కుప్వారాలో మేఘ విస్ఫోటం.. ముంచెత్తిన ఆకస్మిక వరదలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో లోలాబ్ పర్వత ప్రాంతం, వార్నోవ్ అటవీ పరిసరాల్లో మేఘ విస్ఫోటం జరిగింది. దీంతో ఒక్కసారిగా జలప్రవాహం పెరిగి వరదలు సంభవించాయి. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని అధికారులు తెలిపారు. ఇటీవలే కఠువా జిల్లాలోనూ ఇలాంటి మేఘ విస్ఫోటం చోటు చేసుకుంది. ఈ ఘటనతో కలిపి ఉత్తర భారత పర్వత ప్రాంతాల్లో నాలుగోసారి పెద్ద మేఘ విస్ఫోటం సంభవించినట్లు రికార్డైంది. ఇంతకుముందు ఈ నెలలోనే ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశి, జమ్ముకశ్మీర్‌లోని కఠువా జిల్లాల్లో మేఘ విస్ఫోటాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు కూలిపోవడం జరిగి వందలాది మంది మట్టిగుట్టల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

 గతంలో చిసోటి గ్రామంలో మేఘ విస్ఫోటం.. 64 మంది మృతి 

భారత వాతావరణ శాఖ (IMD) ఈ ప్రాంతంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో అధికారులు సున్నితమైన ప్రాంతాల్లో నిఘా పెంచారు. అలాగే కిష్త్వార్ జిల్లాలోని చిసోటి గ్రామంలో గతంలో మేఘ విస్ఫోటంతో ఉద్ధృతమైన వరదల్లో 64 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందల మంది అదృశ్యమయ్యారు.